Mysuru Man Takes Mother On Pilgrimage On Scooter అతన్ని నాకు పరిచయం చేస్తే.. కారు గిఫ్ట్‌గా ఇస్తా: ఆనంద్ మహీంద్రా

Mysuru man takes mother on pilgrimage on scooter

Mysuru Man, Pilgrimage, Anand Mahindra

Mysuru Man Takes Mother On Pilgrimage On Scooter

అతన్ని నాకు పరిచయం చేస్తే.. కారు గిఫ్ట్‌గా ఇస్తా: ఆనంద్ మహీంద్రా

Posted: 10/23/2019 03:03 PM IST
Mysuru man takes mother on pilgrimage on scooter

(Image source from: orissapost.com)

కన్నతల్లి తమకు భారమైందని వదిలించుకునే పిల్లలున్న కాలంలో మైసూరుకు చెందిన ఓ వ్యక్తి 70 సంవత్సరాల తల్లిని తన స్కూటర్‌పై 48,100 కిలోమీటర్ల మేర యాత్రకు తీసుకువెళ్లిన ఉదంతం సోషల్‌మీడియాలో వైరల్‌ అవుతోంది. అమ్మ అంటే ప్రాణం. ఏనాడూ గడపదాటి బయటకు వెళ్లని తల్లిని దేశం మొత్తం తిప్పి చూపించాలని సంకల్పించాడు. అనుకుందే తడవు ఉద్యోగానికి రాజీనామా చేసి మరీ తన 20 ఏళ్ల నాటి బజాజ్‌ స్కూటర్‌పై తల్లిని తీర్థయాత్రలకు తీసుకువెళ్లాడు. ‘మాతృసేవా సంకల్ప్ యాత్ర’ పేరుతో స్కూటర్‌పై సుమారు 18 రాష్ట్రాలు, మూడు దేశాలు తిప్పి చూపించాడు. అలా మాతృరుణం తీర్చుకునే ప్రయత్నం చేసిన.. అది ఆయన తండ్రి కొన్న స్కూటర్. నాలుగేళ్ల క్రితం ఆయన మరణించారు. ఈ ప్రయాణంలో తమతో పాటు తన తండ్రి ఉంటారనే భావనతో స్కూటర్‌ను ఎంచుకున్నారు. ఆయన మాటల్లో చెప్పాలంటే.. ‘‘మేం ముగ్గురు కలిసి ప్రయాణించినట్టే ఉంటుంది. ఆ వ్యక్తి గురించి పారిశ్రామిక దిగ్గజం ఆనంద్ మహీంద్రాకు తెలిసింది. దీంతో ఆయన ఏకంగా కారునే బహుమానంగా ఇస్తానని ట్వీట్ చేశారు.

ఈ విషయాన్ని మనోజ్ కుమార్ అనే వ్యక్తి ట్వీట్ చేస్తే... దాన్ని మహీంద్ర సంస్థల అధినేత ఆనంద్ మహీంద్ర రీట్వీట్ చేస్తూ... ‘‘ఇది అందమైన కథ. ఇందులో మాతృప్రేమ మాత్రమే కాదు.. దేశభక్తి కూడా దాగుంది. షేర్ చేసినందుకు కృతజ్ఞతలు మనోజ్. అతన్ని నాకు పరిచయం చేస్తే.. మహీంద్రా కేయూవీ 100 ఎన్ఎక్స్‌టీ బహూకరిస్తాను. తమ తర్వాతి యాత్రను దానిలో చేయొచ్చు’’ అన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Mysuru Man  Pilgrimage  Anand Mahindra  

Other Articles