తమిళనాడు సహా దేశవ్యాప్తంగా సంచలనం రేకెత్తించిన లలితా జ్యువెలరీ చోరి కేసులో అసక్తికర విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ కేసులో నిందితులైన గణేశన్, మురుగన్ లను విచారిస్తున్న పోలీసులు తమ దర్యాప్తులో కొత్త విషయాలను తెలుసుకుని నివ్వెరపోతున్నారు. వీరిద్దరి అరెస్టుతో పురోగతి సాధించిన తమిళనాడు పోలీసులు అసలు దొంగతనం చేయడానికి ఎలా ప్లాన్ చేశారు. అందుకు ముందు రెక్కీ ఏమైనా నిర్వహించారా.? అన్న విషయాలను విచారణలో తెలుసుకున్నారు.
ఈ క్రమంలో పోలీసులకు సంచలన విషయాలను నిందితులు వెలువరించారని సమాచారం. తిరుచ్చిలోని లలితా జ్యువెలరీ షోరూమ్లో భారీ చోరీకి పాల్పడిన ఇద్దరి దొంగలలో మాస్టార్ మైండ్ అయిన మురుగన్ ఈ చోరీకి ముందు తన భార్యతో కలసి పలుమార్లు షోరూమ్ కు వెళ్లడం అక్కడ తన భార్య నగలు కొనుగోలు చేస్తున్న సమయంలో ఆయన షోరూమ్ లోని పరిస్థితులను మురుగన్ గమనించాడని పోలీసులు వెల్లడించారు. అలా పలుమార్లు తన భార్యతో ఈ షోరూమ్ కు వెళ్లిన మురుగన్ రెక్కీ నిర్వహించాడని పోలీసులు తెలిపారు.
అక్కడి పరిస్థితులను క్షుణ్ణంగా గమనించి వాటిన పూర్తిగా తన బుర్రలో నిక్షిప్తం చేసుకున్న తరువాత.. ఇక ఎక్కడ కన్నం వేస్తే షోరూమ్ లోకి చేరుకుని.. తిరిగి బయటకు వెళ్లడానికి తేలిగ్గా వుండే స్థలాన్ని కూడా అంచనా వేశాడని పోలీసులు పేర్కొన్నారు. ఫోరూమ్ పై పూర్తిగా ఆవగాహన వచ్చిన తర్వాత పక్కాగా ప్లాన్ చేసి నగలు కాజేసినట్టు తెలిపారు. అయితే ఈ విషయాలను మురగన్ సహా నిందితుడు సురేశ్ పోలీసుల విచారణలో వెల్లడించాడు.
ఈ నెల 14 నుంచి పోలీసుల కస్టడీలో ఉన్న సురేశ్ చెబుతున్న విషయాలు పోలీసులనే ఆశ్చర్యపరుస్తున్నాయి. దోపిడీ చేయడానికి ముందు మురుగన్ తన కుటుంబంతో కలిసి ఆ ప్రాంతానికి మకాం మారుస్తాడు. ఆ తర్వాత తీరిగ్గా దోపిడీ చేసి మాయమవుతాడు. లలిత జువెలరీ, పంజాబ్ నేషనల్ బ్యాంకు దోపిడీలకు ముందు కూడా అతడు ఇలానే చేసినట్టు సురేశ్ తెలిపాడు. అంతేకాదు, చెన్నైలోని అన్నానగర్లో చోరీ తర్వాత పోలీసులకు దొరక్కుండా ఉండేందుకు ఓ పోలీసు అధికారికి మురుగన్ రూ. 30 లక్షలు ఇచ్చాడని, తిరువారూర్ పోలీసు అధికారికి ఖరీదైన కారు కొనిచ్చాడని, ఓ సినీ నటికి బంగారు ఆభరణాలను బహుమతిగా ఇచ్చాడని విచారణలో సురేశ్ వెల్లడించాడు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more