3 militants killed in encounter in J&K జమ్మూకాశ్మీర్ లో భీకర ఎన్ కౌంటర్.. 3 ఉగ్రవాదుల హతం

Encounter breaks out between police and terrorists in anantnag

Breaking news, Terrorists, Jammu and kashmir, Encounter in Jammu Kashmir, encounter in Anantnag, Encounter, anantnag

Three terrorists were shot dead by security forces in an encounter in Jammu and Kashmir's Anantnag district this morning, A soldier was injured, sources said. The security forces advanced with caution towards the area in Pazalpora in the district where the terrorists were holed up, sources said.

జమ్మూకాశ్మీర్ లో భీకర ఎన్ కౌంటర్.. 3 ఉగ్రవాదుల హతం

Posted: 10/16/2019 11:04 AM IST
Encounter breaks out between police and terrorists in anantnag

జమ్మూకశ్మీర్ లో ఆర్టికల్ 370ని రద్దు చేసి.. అక్కడి పరిపాలనా పగ్గాలను కేంద్రం చేతిలోకి తీసుకున్నా.. పరిస్థితుల్లో మాత్రం పెద్దగా మార్పు కనిపించడం లేదు. కేంద్రం అధీనంలోకి జమ్మూకాశ్మీర్ శాంతిభద్రతలు రావడంతో ఉగ్రవాదానికి చెక్ పెట్టవచ్చని భావించినా.. ప్రతీకారేచ్ఛతో రగలిపోతున్న పాకిస్థాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు కాశ్మీర్ లో తమ ఉనికి చాటుకునేందుకు ప్రయత్నిస్తూనే వున్నారు. ఈ క్రమంలో అనంత్ నాగ్ జిల్లా, బిజ్‌మెహరా ప్రాంతంలో ఓ ఇంట్లో నక్కిన ఉగ్రవాదులను అదుపులోకి తీసుకునేందుకు భద్రతా దళాలు ప్రయత్నిస్తున్నాయి.

కాగా, భద్రతా దళాలను పసిగట్టిన ఉగ్రవాదులు కాల్పులకు తెగబడటంతో ఇరువర్గాల మధ్య భీకర ఎన్‌కౌంటర్ జరుగుతోంది. ఉగ్రవాదులు నక్కి ఉన్నారన్న సమాచారంతో ఈ ఉదయం భద్రతా దళాలు తనిఖీలు ప్రారంభించగా, ఎదురుపడిన ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. అప్రమత్తమైన భద్రతా దళాలు ఎదురుకాల్పులు ప్రారంభించాయి. దీంతో ఉగ్రవాదులు ఓ ఇంట్లోకి చొరబడ్డారు. ఆ ఇంటిని చుట్టుముట్టిన భద్రతా దళాలు కాల్పులు ప్రారంభించాయి.

ముగ్గురు ఉగ్రవాదులు ఉన్నట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. ప్రస్తుతం ఇరు వర్గాల మధ్య భీకర కాల్పులు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో స్థానికులను అక్కడి నుంచి ఖాళీ చేయించిన అధికారులు.. ముందు జాగ్రత్త చర్యగా మొబైల్, ఇంటర్నెట్ సేవలను నిలిపివేశారు. అయితే సుమారు ఇరువర్గాలకు మధ్య జరిగిన కాల్పలలో భారత భద్రతా దళాలు పైచేయి సాధించాయి.

ఇంట్లో నక్కిన ముగ్గురు ఉగ్రవాదులను హతమార్చాయి. లొంగిపోమ్మని చెప్పినా.. వినకపోవడంతో భద్రతా దళాలు వారిని మట్టుబెట్టాయి. ఈ కాల్పుల్లో భారత భద్రతా దళానికి చెందిన ఓ జవాన కూడా గాయాలపాలయ్యాడు. ఇదిలావుండగా, భారత భద్రతా బలగాలు గత వారం రోజులుగా గాలిస్తున్న ఇద్దరు ఉగ్రవాదులు మంగళవారం గాందర్బల్ అడవుల్లో పోలీసులకు పట్టుబడ్డారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Breaking news  Terrorists  Encounter  anantnag  Jammu and kashmir  India  Crime  

Other Articles