తూర్పు గోదావరి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. భద్రాది రామయ్యను దర్శించుకుని అక్కడి నుంచి అన్నవరం సత్యదేవుడిని దర్శించుకునేందుకు బయల్ధేరిన ఆ భక్తజన బృందానికి ఈ యాత్రే ఆఖరి యాత్రగా మారింది. వారు ప్రయాణిస్తున్న వాహనం మార్గమధ్యంలో అదుపుతప్పి లోయలో పడింది. దీంతో వాహనంలో ప్రయాణిస్తున్న వారిలో అధికులు తిరిగిరానిలోకాలకు తరలివెళ్లారు.
ఈ ఘటన మారేడుమిల్లి - చింతూరు మధ్య సంభవించింది. భద్రాచలం నుంచి అన్నవరం దైవ దర్శనానికి వెళ్తుండగా ఘాట్ రోడ్డులోని వాల్మీకి కొండ వద్ద టెంపో వాహనం అదుపుతప్పి లోయలో పడింది. ఈ ఘటనలో మొత్తం ఎనమిది మంది దుర్మరణం చెందారు. ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. ఘటనాస్థలంలో ఆరుగురు అక్కడికక్కడే మృతిచెందగా.. ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలోనే మరొకరు ప్రాణాలు కోల్పోయారు.
కాగా మరోకరు అస్పత్రిలో చికిత్స పోందుతూ మృతిచెందారు. ఈ ప్రమాద ఘటనలో గాయాలపాలైన క్షతగాత్రులను రంపచోడవరం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి చికిత్సను అందిస్తున్నారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు, అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. టెంపో మారేడుమిల్లి నుంచి బయల్దేరిన కొద్దిసేపటికే ఈ ప్రమాదం చోటుచేసుకుందని ప్రత్యక్షసాక్షులు చెబుతున్నారు.
పర్యాటకులంతా కర్ణాటక రాష్ట్రం చిత్రదుర్గం జిల్లాలోని చెలకెరి గ్రామస్థులుగా పోలీసులు గుర్తించారు. భద్రాచలం దర్శనం అనంతరం అన్నవరం వెళ్తుండగా ఈ ఘోరం చోటుచేసుకుంది. ప్రమాద సమయంలో టెంపోలో 12 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. అయితే ఈ రహదారిపై వాహనం అదుపుతప్పి ప్రమాదం సంభించిందా.? లేక మరేదైనా కారణమా అన్న కోణంలో పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
మారేడుమిల్లి-చింతూరు రహదారి లోయలు, గుట్టలతో చాలా ప్రమాదకరంగా ఉంటుంది. ఇటీవల భారీ వర్షాలు కురుస్తుండటంతో ఈ మార్గం మరింత ప్రమాదకరంగా మారింది. దట్టమైన అటవీప్రాంతంలో ఉన్న ఈ రహదారిలో చాలా నైపుణ్యం ఉన్న డ్రైవర్లు మాత్రమే ఎక్కువగా వాహనాలు నడుపుతుంటారని.. కొత్తగా వచ్చేవారు ప్రమాదాలకు గురయ్యే అవకాశాలు ఉన్నాయని స్థానికులు చెబుతున్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more