ప్రభుత్వం తమ న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం సానుకూలంగా స్పందించి పరిష్కరించేంత వరకు తమ ఉద్యమం కోనసాగిస్తామన్న అర్టీసీ కార్మిక సంఘాల ఐక్యవేదిక పిలుపు మేరకు పదో రోజున కూడా సమ్మెను కొనసాగిస్తున్నారు కార్మికులు. ఆంద్రప్రదేశ్ రాష్ట్రం తరహాలో ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసి తమను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలన్న ప్రధాన డిమాండ్ ను తొలుత పరిష్కరించాలని కార్మికులు నినదిస్తున్నారు. తమ డిమాండ్లను అంగీకరించాలని ఉద్యమబాటలో ముందుకు వెళ్తున్న కార్మికులు.. తెలంగాణ ఉద్యమ పంథాలోనే సమ్మెను కొనసాగిస్తున్నారు.
సమ్మెను ఉద్యమబాటలో ముందుకు తీసుకెళ్తున్న కార్మికులు జేఏసీ పిలుపుమేరకు ఇవాళ అర్టీసీ డిపోల ఎదుట తమ కుటుంబసభ్యులతో కలసి ఆందోళనలు నిర్వహిస్తున్నారు. తమ న్యాయమైన డిమాండ్ల పరిష్కారం కోరుతూ ఈ నెల 5 నుంచి సమ్మెలోకి వెళ్లిన కార్మికులపై ప్రభుత్వం తీవ్ర ఆగ్రహంగా ఉంది. అటు ప్రభుత్వం..ఇటు కార్మికులు పట్టు వీడడం లేదు. పలు దశలుగా నిరసనలు చేపడుతున్నారు. అక్టోబర్ 14వ తేదీ సోమవారం కుటుంబసభ్యులతో కలిసి రాష్ట్ర వ్యాప్తంగా డిపోల ఎదుట భైఠాయించారు.
ఆర్టీసీని కాపాడాలంటూ నినాదాలు చేశారు. వారి పిల్లలు కూడా ఆందోళనలో పాల్గొన్నారు. ప్లకార్డులు పట్టుకుని నిరసనకు మద్దతు పలికారు. రాజధాని నగరంలోని ముషిరాబాద్ డిపో ఎదుట కార్మికులు ఆందోళన చేపట్టారు. ఆత్మహత్య చేసుకున్న డ్రైవర్ శ్రీనివాసరెడ్డి, కండక్టర్ సురేంద్రగౌడ్ల ఫొటోలకు నివాళులర్పించారు. ఆందోళనలను మరింత ఉధృతం చేస్తామని కార్మికులు హెచ్చరించారు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహింపట్నం బస్ డిపో ఎదుట కార్మక సంఘాలు నేతలు ఆందోళనకు దిగారు.
సమ్మెకు మద్దతు ప్రకటించిన విద్యార్థి సంఘాల నేతలు హైదరాబాద్ లోని బస్ భవన్ ముట్టడికి ప్రయత్నించారు. అయితే సమాచారం అందుకున్న పోలీసులు బస్ భవన్ చేరుకున్న విద్యార్థి సంఘాల నేతలను అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా ఇరు వర్గాల మధ్య వాగ్వాధం, తోపులాట చోటు చేసుకుంది. అనంతరం విద్యార్థులను అరెస్టు చేసి పీఎస్కు తరలించారు. ఈ సందర్భంగా విద్యార్థి సంఘాల నేతలు ముఖ్యమంత్రి అహంకార ధోరణిని విమర్శిస్తున్నారు. ఆర్టీసీ కార్మికుల ఆవేదనను అర్థం చేసుకోలేని ముఖ్యమంత్రి పదవిలో కొనసాగడం ఎందుకని నిలదీశారు.
అక్టోబర్ 05వ తేదీ నుంచి కార్మికులు సమ్మెలోకి వెళ్లారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని..ఇతర డిమాండ్లతో సమ్మెలోకి వెళ్లారు. సమ్మెను ప్రభుత్వం సీరియస్గా తీసుకుంది. అక్టోబర్ 06వ తేదీన సాయంత్రం వరకు విధులకు హాజరు కాని వారి ఉద్యోగాలు తీసేసినట్లు, తాత్కాలికంగా డ్రైవర్లు, కండక్టర్లను నియామకాలు చేపట్టింది. వంద శాతం బస్సులను రోడ్లపైకి తీసుకరావాలని, ప్రజలకు ఇబ్బందులు కలుగకుండా చూడాలని సీఎం కేసీఆర్ స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more