తెలంగాణ ఆర్టీసీలో కార్మికులకు సమ్మెకు దిగిన నేపథ్యంలో ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా వుండేందుకు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ప్రయాణికులపై అదనపు భారాన్ని మోపుతుండగా, ప్రైవేటు వాహనదారులకు మాత్రం కాసుల వర్షాన్ని కురిపిస్తోంది. అదెలా అంటే సమ్మెట పోటుతో ప్రయాణికులు అనేక ఇబ్బందులు పడుతున్న క్రమంలో వారికి కొంత ఊరట కల్పించేందుకు అర్టీసితో అగ్రీమెంటు చేసుకున్న ప్రైవేటు బస్సులు నడిచేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంది.
సమ్మెతో తాత్కాలిక కండర్టర్లు టికెట్లు ఇవ్వకుండా ప్రయాణికుల నుంచి డబ్బును వసూలు చేస్తున్నారు. అసలు ఆ మార్గంలో వెళితే టికెట్ ధరగా ఎంత డబ్బు వసూలు చేస్తారో కూడా తెలియకుండానే బస్సునెక్కి కండక్టర్ల అవతారమెత్తి.. తమ జేబులు నింపుకుంటున్నారు. తప్పని సరి పరిస్థితుల్లో గత్యంతరం లేక బస్సులను ఆశ్రయిస్తున్న ప్రయాణీకుల నుంచి తమ ఇష్టమొచ్చినట్టుగా ఛార్జీల రూపంలో డబ్బులను దండుకుంటున్నారు. అయితే ప్రయాణికుల నుంచి ఈ మేరకు అనేక పిర్యాదులు వెల్లువెత్తడంతో.. ప్రభుత్వం దిద్దుబాటు చర్యలకు పూనుకుంది.
అందిులో బాగంగా ప్రయాణీకుల నుంచి అధిక ఛార్జీలు వసూలు చేసే తాత్కాలిక కండక్టర్లపై చర్యలు తీసుకుంటామని ప్రకటించింది. నల్గొండ ఎస్పీ రంగనాథ్.. నార్కట్ పల్లి బస్టాండ్ లో బస్సుల రాకపోకలను పరిశీలించారు. ఎంత ఛార్జీ తీసుకుంటున్నారని ప్రయాణికులను అడిగి తెలుసుకున్నారు. అసలు ధర కంటే ఎక్కువగా వసూలు చేశారని ప్రయాణికులు చెప్పడంతో ఆయన సీరియస్ అయ్యారు. ఈ క్రమంలోనే నార్కట్ పల్లిలో టికెట్ రేటు కన్నా అధిక ఛార్జీలు వసూలు చేస్తున్న ఇద్దరు కండక్టర్లపై పోలీసులు కేసు నమోదు చేశారు.
యాదగిరిగుట్ట డిపోకు చెందిన రామాంజనేయులు అనే తాత్కాలిక కండక్టర్ను విధుల నుంచి తొలగించింది. అతడిపై సెక్షన్ 420 కింద కేసు నమోదు చేయాలని ఆదేశించిన ఎస్పీ ఏవి రంగనాథ్ పోలీసులను ఆదేశించారు. మరోవైపు ఖమ్మం డిపోకు చెందిన కండక్టర్ నాగేశ్వరరావుపై కూడా అధికంగా డబ్బులు వసూలు చేస్తున్నారని చీటింగ్ కేసు నమోదు చేశారు. భువనగిరి నుంచి నల్గొండ వెళ్లే బస్సులో అసలు టికెట్ ధర రూ.65. కాగా ఒక్కో ప్రయాణికుడి దగ్గర రూ.75 వసూలు చేశారు.
ఖమ్మం నుంచి హైదరాబాద్ వెళ్తున్న బస్సులోనూ అధిక ఛార్జీలు వసూలు చేశారన్న ఫిర్యాదుతో పోలీసులు చర్యలు తీసుకున్నారు. ఇప్పటికే ఈ అంశంపై ప్రభుత్వానికి, ఆర్టీసీ యాజమాన్యానికి అనేక ఫిర్యాదులు వచ్చాయి. ఇందుకు సంబంధించిన పలు వీడియోలు కూడా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఈ నేపథ్యంలో రంగంలోకి దిగిన ప్రభుత్వం పోలీసులను సాయంతో ఇలాంటి వాటికి అడ్డుకట్ట వేయాలని నిర్ణయించింది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more