తెలంగాణలొ ఆర్టీసీ కార్మికుల సమ్మె మూడవ రోజుకు చేరుకున్న తరుణంలో ఇకపై వారిని ఉద్యోగాల్లోకి తీసుకోబోమని, వారిని విధుల నుంచి తొలగించినట్టేనని పండుగ నేపథ్యంలో స్వయంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించడం చర్చనీయాంశంగా మారింది. దసరా పండుగ వేళ తమ డిమాండ్లను నెరవేర్చాలని సమ్మెబాట పట్టిన డ్రైవర్లు, కండక్టర్లతో పాటు సుమారు 48 వేల మంది కార్మికులను షాకిచ్చారు కేసీఆర్.
అంతేకాదు ఆర్టీసీలో ప్రస్తుతం కేవలం 1,200 మందికన్నా తక్కువగానే ఉద్యోగులు ఉన్నట్లు ముఖ్యమంత్రి స్వయంగా ప్రకటించడం కార్మికుల్లో కలవరానికి కూడా కారణమవుతోంది. వాస్తవంగా ఆర్టీసీలో 49,860 మంది పని చేస్తున్నారు. అంటే సమ్మెలో ఉన్న మిగిలిన 48,660 మంది కార్మికులను తొలగించినట్లేనని చెప్పకనే చెప్పారా? అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అదే నిజమైతే ఇది సంచలనానికి దారితీస్తుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
కాగా, ఆర్టీసీ భవిష్యత్ పై చర్చించేందుకు ప్రత్యేక కమిటీని నియమించింది ప్రభుత్వం. సునీల్ శర్మ నేతృత్వంలోని కమిటీ కార్యాచరణపై చర్చిస్తోంది. నష్టాలను అధిగమించడం.. అప్పులు తగ్గించుకోవడం.. ఆకుపెన్సీ పెంచడం వంటి కీలక అంశాలపై కమిటీ చర్చిస్తోంది. ఈ తరుణంలో మధ్యాహ్నం అధికారులతో సీఎం కేసీఆర్ మరోసారి భేటీ అయ్యారు. ఆర్టీసీని గాడినపెట్టడంపై కీలక నిర్ణయాలపై చర్చించారు. దీంతో పాటు ఆర్టీసీ కొత్త ఉద్యోగులను నియామకాలు, విధివిధానాలపై చర్చించారు.
ఆర్టీసీ కార్మికులు బ్లాక్ మెయిల్ విధానాన్ని అవలంభిస్తున్నారని సీఎం కేసీఆర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ వారిని విదుల్లోంచి తప్పించేలా నిర్ణయాన్ని తీసుకున్నారా.? అన్న అనుమానాలు కలుగుతున్నాయి. గతంలో 2003 ప్రాంతంలో తమిళనాడులో సమ్మెకు దిగిన 1.7 లక్షల మంది ఉపాధ్యాయులు, రెవెన్యూ ఉద్యోగులను తొలగిస్తున్నట్లు అప్పటి ముఖ్యమంత్రి కె.జయలలిత ప్రకటించారు. ఆ మేరకు ఆర్డినెన్స్ జారీ చేయడం అప్పట్లో సంచలనం సృష్టించింది.
ఆర్టీసీలో కొత్త నియామకాలు చేపడతామంటూ స్వయంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించడం ఆయన అహంకారానికి నిదర్శనమని ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంతమంది ఉద్యోగులను ఒకేసారి తొలగిస్తామనడం అప్రజాస్వామికమని చెప్పారు. నిన్నటి వరకు ఆర్టీసీని కాపాడుకోవడం కోసం ఆందోళన చేశామని.. ఇక నుంచి ప్రజాస్వామ్యాన్ని కాపాడుకునేందుకు పోరాడాల్సిన అవసరముందని ఆయన పిలుపునిచ్చారు. కేసీఆర్కు ఉద్యమ ఫోబియా పట్టుకుందని ఆయన ఎద్దేవా చేశారు.
ఆర్టీసీని ప్రభుత్వం ఆదుకోవాలని.. కార్మికులకు రావాల్సిన బకాయిలను సకాలంలో చెల్లించాలని డిమాండ్ చేశారు. ఆర్టీసీని ప్రైవేటు పరం చేసే యోచనలో ప్రభుత్వం ఉందని.. దీన్ని కార్మికులు, ప్రజలంతా అడ్డుకుంటారన్నారు. ‘‘48వేల కార్మికులను తీసేశామని అంటున్నారు. ఆ ఉత్తర్వులు ఎప్పుడు పంపిస్తారో చెప్పండి. వాటిని తీసుకోవడానికి కార్మికవర్గం మొత్తం సిద్ధంగా ఉన్నాం. మేం కూడా న్యాయనిపుణులతో మాట్లాడాం. దీనిపై కోర్టులోనే తేల్చుకుంటాం’’ అని అశ్వత్థామరెడ్డి హెచ్చరించారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more