భారత జాతికి మేలు చేసిన కాంగ్రెస్ నేతలను సొంతం చేసుకునే పనిలో పడ్డ కేంద్రంలోని అధికార బీజేపి ఇప్పటికే కాంగ్రెస్ పార్టీకి చెందిన మహానేత తొలి ఢిప్యూటీ ప్రధానమంత్రి సర్దార్ వల్లభబాయ్ పటేల్ ను సొంతం చసుకుని ఆయన అతిపెద్ద విగ్రహాన్ని నర్మదా నదీ తీరాన ఏర్పాటు చేసి తమ వాడిగా మార్చుకున్న బీజేపి ఇక తాజాగా మాజీ ప్రధాని పీవీ నరసింహారావును కూడా తమవాడిగా ముద్రవేసుకునే ప్రయత్నం ప్రారంభించింది. అందుకు ఆనుగూణంగా బీజేపి సీనియర్ నేత, రాజ్యసబ సభ్యుడు సుబ్రహ్మణ్యస్వామి చేత పావులు కదిపిస్తోంది.
‘భారతరత్న’కు అర్హుడని మాజీ ప్రధాని పివీ నరసింహారావు అన్ని విధాలా అర్హుడని సుబ్రహ్మణ్య స్వామి అన్నారు. దేశం ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న తరుణంలో మన్మోహన్సింగ్ లాంటి ఆర్థిక నిపుణుడిని ఆర్థికమంత్రిగా ఎంచుకోవడం పీవీ వివేకానికి నిదర్శనమని ప్రశంసించారు. మన్మోహన్సింగ్ ప్రధానిగా ఉన్నప్పటి కంటే ఆర్థికమంత్రిగానే ఎక్కువ సంస్కరణలు తీసుకురాగలిగారని అన్నారు. దేశ అర్థిక వ్యవస్థను గాడిలో పెట్టి ముందుకు నడిపారని ప్రశంసించారు.
అయితే, అర్థిక మంత్రిగా, ఆ రంగ నిపుణుడిగా ఇది మన్మోహన్సింగ్ తోనే సాధ్యమైనా.. ఆయనకు మాత్రం ఎలాంటి ప్రశంస దక్కనీయకుండా ఆ ఘనత మన్మోహన్ సింగ్ ది కాదని, ఆ క్రెడిట్ అంతా పీవీ నరసింహారావుకే చెందుతుందన్నారు. వచ్చే గణతంత్ర దినోత్సవం నాటికైనా ఆయనకు ‘భారతరత్న’ ఇవ్వాల్సిందేనని సుబ్రహ్మణ్యస్వామి పేర్కొన్నారు. ముంబైలో సోమవారం జరిగిన ఓ కార్యక్రమంలో ఆయనీ వ్యాఖ్యలు చేశారు. కేవలం ఆర్థిక సంస్కరణలు తెచ్చి వదిలిపెట్టకుండా కశ్మీర్ మొత్తం మాదే అని తీర్మానించిన ఘనత కూడా పీవీదేనని సుబ్రహ్మణ్యస్వామి కొనియాడారు.
అసంపూర్తిగా మిగిలిన ఎజెండా పీవోకే స్వాధీనమే అని పీవీ నిర్భయంగా చెప్పారని గుర్తు చేశారు. కాగా, గత నెల 11న ఢిల్లీలో జరిగిన ఓ కార్యక్రమంలో సుబ్రహ్మణ్యస్వామి మాట్లాడుతూ పీవీ ‘భారతరత్న’కు అర్హుడేనని అన్నారు. బాబ్రీ మసీదు కింద ఓ ఆలయం ఉండేదన్న విషయం శాస్త్రీయంగా తేలితే ఆ ప్రాంతాన్ని తమ ప్రభుత్వం హిందువులకు ఇచ్చేస్తుందని సుప్రీంకోర్టుకు పీవీ తెలియజేశారని సుబ్రహ్మణ్యస్వామి గుర్తు చేశారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more