godess kanakadurgadevi in Sri Gayatri Devi avatar శ్రీ గ్రాయత్రి దేవి అవతారంలో కనకదుర్గ అమ్మవారు..

Sri kanaka durga atop indrakeeladri in sri gayatri devi avatar

Dussehra, Sri Kanakadurga temple, Goddess Durga, Sri Gayatri Devi darshan, Indrakeeladri, stanacharyulu, temple chief priest, YS Jagan Mohan Reddy, devotees, Andhra pradesh

The nine-day long Navratri festival celebrations at Sri Kanakadurga temple atop Indrakeeladri hill begun 29th September. "Today Goddess Durga will appear as Sri Gayatri Devi on the Third day of the nine-day festival. The devotees are being allowed to take darshan from 3 am onwards.

శ్రీ గ్రాయత్రి దేవి అవతారంలో కనకదుర్గ అమ్మవారు..

Posted: 10/01/2019 10:05 AM IST
Sri kanaka durga atop indrakeeladri in sri gayatri devi avatar

విజయవాడ ఇంద్రకీలాద్రిపై వెలసిన శ్రీ కనకదుర్గ అమ్మవారి దసరా శరన్నవరాత్రుల ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఈ తొమ్మిది రోజుల వ్యవధిలో.. తెలుగు రాష్ట్రాల్లోని భక్తులు ఇరు రాష్ట్రాల నలుమూలల నుంచి ఇక్కడి వచ్చి అమ్మవారిని దర్శించుకుంటారు. తెలుగు రాష్ట్రాలతో పాటు పక్క రాష్ట్రాల భక్తులకు కూడా ఇక్కడకు చేరుకుని అమ్మవారిని దర్శించుకుని తిరిగి వెళ్తుంటారు.

ఉత్సవాల్లో భాగంగా మూడవ రోజు అక్టోబర్ 1, మంగళవారం నాడు అమ్మవారు శ్రీ గాయత్రి దేవి అలంకారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. విజయవాడ ఇంద్రకీలాధిపై వెలసిన అమ్మవారిని దర్శించుకోటానికి భక్తులు వేకువజాము నుండే ఇంద్రకీలాద్రికి బారులుతీరారు. దీంతో ఇంద్రకీలాద్రి భక్తులతో కిటకిటలాడుతోంది. గాయత్రిదేవి ఎంతో మహిమాన్వితమైనదని విశ్వసిస్తారు,

ఇక ఈ రోజున కొందరు అమ్మవారిని చంద్రఘంటగా అరాధిస్తారు. అమ్మవారు కూడా వారిని చంద్రఘంట రూపంలో దర్శనమిస్తారు. ఈ రూపంలో అమ్మవారు స్వరూపం చంద్రబింబం వలె ఉంటుంది. అమ్మవారిని తెల్లటి పూలతో పూజిస్తారు. “గాయత్రి వ్యాహృతి సంధ్యా నిజబృంద నిషేవితా“ అనే మంత్రాన్ని జపిస్తారు. గాయత్రి దేవి అనుగ్రహంతో జీవితంలో అన్నపానాలను ఎటువంటి ఢోకా ఉండదని భక్తుల నమ్మకం.

“ముక్తావిద్రుమ హేమనీల ధవళశ్ఛాయే ముఖైః త్రియక్షణైః... యుక్తాబిందుం నిబద్ధరత్నాం తత్వార్ధవర్ణాత్మికాం” అనే శ్లోకంతో ఈ రోజున గాయత్రి దేవిని, లేదా చంద్రఘంటా దేవిని ఆరాధిస్తే అమ్మ శ్రీఘంగా అనుగ్రహిస్తుంది. ఈ శ్లోకం రానివారు గాయత్రీ మంత్రాన్ని కనీసం 11సార్లు జపిస్తే మంచి ఫలితం లభిస్తుంది. ఏ మంత్రానైనా శుచితో ఏకాగ్రతతో పఠిస్తే ఫలితం వస్తుందన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles