భారత అంతరిక్ష చరిత్రలో చారిత్రాత్మక ఘట్టం కాస్తలో విఫలమైనా.. ఇస్రో శాస్తవేత్తలకు మాత్రం ఇంకా ఆశలు సజీవంగానే వున్నాయి. ఇప్పటికీ తాము చంద్రుడి దక్షిణ ధ్రువంపైకి పంపిన విక్రమ్ ల్యాండర్ పనిచేస్తుందని, అయితే దాని నుంచి గ్రౌండ్ స్టేషన్ కు సమాచార సమన్వయం మాత్రమే కోల్పోయిందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. 14 రోజుల నిరీక్షణ, అన్వేషణ తరువాత కూడా విక్రమ్ ల్యాండర్ అచూకీ తెలియక పోవడంతో ఇక ఇప్పటికీ కథ ముగిసినట్టేనని భారతీయులు భావిస్తున్నారు.
అయితే 14 రోజల పాటు విక్రమ్ అచూకీ కోసం అవిశ్రాంత అన్వేషణ కొనాసాగించా.. వారిలో మాత్రం ఇంకా ఆశలు విఫలం కాలేదు. తమ శ్రమ వృధాకాదని, మరో 14 రోజుల తరువాత ఫలితం లభిస్తుందని వారు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ద్రయాన్-2లో భాగంగా జూలై 22న చంద్రునిపైకి భారత్ ప్రయోగించిన విక్రమ్ ల్యాండర్ అన్ని దశలు దాటుకుని విజయవంతంగా చంద్రుని సమీపంలోకి చేరింది. ఈనెల 7వ తేదీన చివరి ఘట్టమైన ల్యాండింగ్ ప్రక్రియలో చివరి నిమిషంలో విక్రమ్ నుంచి సాంకేతిక సమస్వయం గ్రౌండ్ స్టేషన్ కు తెలిగిపోయాయి.
దీంతో ల్యాండర్ను వెతికి పట్టుకుని చివరి సెకన్లలో చేజారిన విజయాన్ని చేజిక్కించుకునేందుకు, వైఫల్యాన్ని వెతికి పట్టుకునేందుకు ఇస్రో చేసిన ఏ ప్రయత్నం ఫలితం ఇవ్వలేదు. ఆర్బిటర్లోని కెమెరాల ద్వారా ఫొటోలు తీసిన శాస్త్రవేత్తలు ల్యాండర్ బలంగా చంద్రుని ఉపరితలాన్ని ఢీకొట్టిందన్న నిర్ధారణకు వచ్చారు. విక్రమ్లోని 'ఆటోమేటిక్ ల్యాండింగ్ ప్రొగ్రామ్' లో తలెత్తిన లోపం వల్లే ఇలా జరిగిందని భావిస్తున్నారు.
కనీసం 200 కిలోమీటర్ల వేగంతో ల్యాండర్ చంద్రుడిని ఢీకొట్టి నిర్వీర్యమైంది. వ్యోమనౌక బోల్తా కొట్టడంగాని, పక్కకు ఒరిగి పడిపోవడంగాని జరిగి ఉంటుందని, అందుకే కమ్యూనికేషన్ సంబంధాలు తెగిపోయాయని భావిస్తున్నారు. ఇక చంద్రుడిపై ఈరోజు ఉదయంతో లూనార్ పగలు ముగిసింది. దీంతో మరో 14 రోజులపాటు దక్షిణ ధ్రువంపై చీకటి పరుచుకుంటుంది. పైగా ఈ కాలంలో ఉష్ణోగ్రతలు మైనస్ 200 డిగ్రీలకు పైనే నమోదవుతాయి.
ఈ పరిస్థితులను తట్టుకునే శక్తి విక్రమ్ ల్యాండర్, అందులోని ప్రజ్ఞాన్ రోవర్లకు లేదు. దీంతో దీని కథ ముగిసినట్టే అన్నది పలువురు శాస్త్రవేత్తల అభిప్రాయంగా తెలుస్తున్నా. ఇస్రోలోని కొందరు శాస్త్రవేత్తలు మాత్రం మరో 14 రోజుల తరువాత తమ అన్వేషణ కొనసాగుతుందని, లూనార్ పగలు మొదలయ్యాక ఆర్బిటర్ కెమెరా నుంచి పరిశీలించి విక్రమ్ జాడ కనుక్కునే ప్రయత్నం చేస్తామని అంటున్నారు. అయితే ఇప్పటికే విక్రమ్ ల్యాండర్ నిర్వీర్యమై ఉంటుందన్న వాదనలు కూడా వినిపిస్తున్నాయి.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more