కేంద్రమంత్రి బాబుల్ సుప్రియోకు పశ్చిమబెంగాల్ లో చేదు అనుభవం ఎదురైంది. జాదవ్పూర్ యూనివర్సిటీలో గురువారం నిర్వహించిన ఓ సదస్సుకు హాజరైన ఆయనను వామపక్ష అనుబంధ విద్యార్థి సంఘాలు ఘోరావ్ చేశాయి. కేంద్ర మంత్రికి నల్లజెండాలు చూపించి వెనక్కి వెళ్లిపోవాలంటూ కొంతమంది విద్యార్థులు నిరసన తెలిపారు. ఏబీవీపి నిర్వహించిన సదస్సులో పాల్గొనేందుకు వచ్చిన బాబుల్ సుప్రియోను వామపక్ష విద్యార్థి సంఘాలు అడ్డుకున్నాయి,
సమావేశ ప్రాంగణంలోకి రాకుండానే దాదాపు గంటన్నర సేపు అడ్డుకున్నారు. అతికష్టంతో సదస్సులో పాల్గొన్న కేంద్ర మంత్రిని తర్వాత బయటకు వెళ్లకుండా విద్యార్థులు చుట్టుముట్టి ఘెరావ్ చేశారు. విషయం తెలుసుకన్న రాష్ట్ర గవర్నర్ హుటాహుటిన అక్కడకు చేరుకున్నారు, ఆయనతో పాటు సీఆరపీఎఫ్ బలగాలను కూడా అక్కడకు రప్పించారు, అయితే, యూనివర్సిటీ గేట్లు మూసివేసిన విద్యార్థులు సీఆర్పీఎఫ్ దళాలను అడ్డుకునే ప్రయత్నం చేశారు. చివరకు గవర్నర్ జోక్యంతో పాటు అధ్యాపకులు, పోలీసులు కల్పించుకోవడంతో గొడవ సద్దుమణిగింది.
ఈ ఘటనను గవర్నర్ కార్యాలయం తీవ్రంగా పరిగణించింది. రాష్ట్రంలోని శాంతి భద్రతలపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందని అభిప్రాయపడింది. ఘటన అనంతరం కేంద్ర మంత్రి సుప్రియో మాట్లాడుతూ.. తాను రాజకీయాలు చేయడానికి ఇక్కడకు రాలేదన్నారు. పలువురు తనను అవహేళన చేశారని, నా జుట్టు పట్టుకుని లాగి నెట్టివేశారని కేంద్ర మంత్రి తెలిపారు. తమను తాము నక్సల్స్గా పేర్కొంటూ నన్ను రెచ్చగొట్టేందుకు ప్రయత్నించారని బాబుల్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయం తెలిసిన వెంటనే రాష్ట్ర గవర్నర్ విశ్వవిద్యాలయానికి వచ్చారు.
మరోవైపు, గవర్నర్ చర్యలపై అధికార తృణమూల్ తీవ్రంగా మండిపడింది. రాష్ట్ర ప్రభుత్వం లేదా ఉన్నతాధికారులను ఏ మాత్రం సంప్రదించకుండా గవర్నర్ నేరుగా జోక్యంచేసుకోవడం ఏంటని నిలదీసింది. కేంద్ర ప్రభుత్వ తొత్తుగా గవర్నర్ వ్యహరిస్తున్నారని తృణమూల్ పార్టీ దుయ్యబట్టింది. ఇందులో తమ పార్టీ గానీ, పోలీసులు గానీ జోక్యం చేసుకోలేదని ఇది కేవలం బీజేపీ, వామపక్ష విద్యార్థి సంఘాల మధ్య చోటుచేసుకున్న వివాదం మాత్రమేనంటూ ఉద్ఘాటించింది. అంతేకాదు, కేంద్ర మంత్రి పర్యటనపై ప్రభుత్వానికి ఎలాంటి ముందస్తు సమాచారం లేదని, పోలీసులు సైతం యూనివర్సిటీ బయట వేచి ఉన్నారని ఆ పార్టీ నేత వ్యాఖ్యానించారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more