ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నెల్లూరు జిల్లాలో నకిలీ నోట్లను ముద్రించి చెలామణి రాకెట్ ను పోలీసులు అరెస్టు చేశారు. అత్యంత నాణ్యతతో కూడిన హై క్వాలిటీ నకిలీ నోట్లను ముద్రిస్తూ.. సాధారణ వీధి వ్యాపారుల నుంచి బడా వ్యాపారుల వరకు బురిడీ కొట్టించి మరీ అసలు డబ్బును సొమ్ము చేసుకుంటున్నారు. ఈ ముఠా సభ్యుల నుంచి రూ.2000, రూ.500, రూ.200, రూ.100, రూ.50, రూ.20, రూ.10 నకిలీ నోట్లు సుమారు రూ.39 లక్షల విలువైనవి స్వాధీనం చేసుకున్నారు. ఈ ముఠాలో నలుగురు బృంద సభ్యులను ఈ నెల 5న అరెస్టు చేయగా, మరో 5గురుని అరెస్టు చేసినట్లు నెల్లూరు ఎస్పీ ఐశ్వర్య రస్తోగీ తెలిపారు.
కాగా ముఠాలోని ప్రధాన నిందితుడైన మురళీకృష్ణ గతంలోనే నకిలీ నోట్లను చలామణీ కేసులో అరెస్టయ్యాడు. ప్రస్తుతం బెయిల్ పై విడుదలై మరోసారి తిరిగి అదే దందా ప్రారంభించడం గమనార్హం. జైల్లో పరిచయమైన సహ ఖైదీలతో కలసి చేస్తున్నాడా.? లేక అతనే ఒక ముఠాను ఏర్పాటు చేసుకుని ఈ నేరాలకు పాల్పడుతున్నాడా.? అన్న విషయాన్ని పోలీసలు దర్యాప్తు చేస్తున్నారు. ఈ ముఠాలోని నిందితులు గుంటూరు, కర్నూలు, నెల్లూరు, ప్రకాశం జిల్లాలకు చెందినవారని పోలీసులు తెలిపారు. వీరిలో ఒక నిందితుడు మాత్రం రాజస్థాన్ కు చెందినవాడని తెలిపారు.
వీరంతా కలిసి నకిలీ నోట్లను ముద్రించి చెలామణి చేస్తున్నారు. పలువురు వ్యాపారుల నుంచి నకిలీ నోట్లకు సంబంధించిన ఫిర్యాదులు వెల్లువెత్తిన నేపథ్యంలో పోలీసులు పథకం ప్రకారం వీరిని అరెస్టు చేసి మీడియా ముందు ప్రవేశపెట్టారు. వీరి నుంచి నకిలీ ముద్రణ యంత్రాలను సైతం స్వాధీనం చేసుకున్నారు. ఇదిలా ఉంటే నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో గత కొన్ని నెలలుగా, చిన్న, చిన్న దుకాణాలు, మందుల కొనుగోళ్లు, శీతలపానీయాల దుకాణాల వ్యాపారులు తమకు నకిలీ నోట్ల బెడద ఎక్కువగా ఉందని వాపోతున్నారు. అయితే పోలీసులు నకిలీ నోట్ల ముఠాల ఆట కట్టించడంపై వారంతా హర్షం వ్యక్తం చేస్తున్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more