తన కన్నవారిని కంటికి రెప్పలా కాపాడాల్సిన తండ్రే.. కామాంధుడిగా మారి కన్నకూతురిని లైంగికంగా వేధించడంతో ఆ ఫైశాచిక మృగానికి ఎల్బి నగర్ న్యాయస్థానం ఐదేళ్ల జైలు శిక్షతో పాటు రూ.5 వేల జరిమానా విధిస్తూ తీర్పును వెలువరించింది. వివరాల్లోకి వెళితే ఆల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలో నివసిస్తున్న లింగం కుమార్ కు ఒ కొడుకు, ఓ కుతూరు వున్నారు. ఆయన భార్య పదేళ్ల క్రితం మరణించడంతో పదేళ్ల కూతురు, కుమారుడితో కలిసి అదే ప్రాంతంలో జీవిస్తున్నాడు.
అయితే పశువాంఛతో రెండేళ్ల నుంచి కూతురిని లైంగికంగా వేధిస్తున్నాడు. తన తండ్రే కదా అని చనువుగా వున్న తన కూతురిపై దారుణంగా వ్యవహరించాడు. దీనిని గమనించిన అమె తన తండ్రికి దూరంగా వుండటం ప్రారంభించింది. అయితే ఎవరూ లేని సమయంలో అమెపై చేయిచేసుకుని మరీ అఘాయిత్యానికి పాల్పడ్డారు. ఇలా నెల రోజుల పాటు అమెపై అత్యాచారానికి పాల్పడటంతో.. తన తండ్రి అఘాయిత్యాలను భరించలేక బాలిక వారి బంధువుల ఇంటికి వెళ్లి అక్కడే ఉంటోంది.
రాఖీ పండగకు సోదరుడికి రాఖీ కట్టేందుకు రాగా లింగం కుమార్ మరోసారి కూతురితో అసభ్యంగా ప్రవర్తించాడు. తిరిగి వెళ్లిన తర్వాత బాలిక తను చదువుకుంటున్న పాఠశాల ఉపాధ్యాయురాలికి చెప్పడంతో ఆమె డిసిపియూ వారి దృష్టికి తీసుకువెళ్లింది. కాగా ఈ ఘటనతో బాలిక జూలై 12, 2014న పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేసి నిజాన్ని నిగ్గు తేల్చారు. కోర్టులో ఛార్జ్ షీట్ వేయగా తుది సాక్ష్యాధారాల ఆధారంగా కోర్టు నిందితుడికి ఐదేళ్ల జైలు, 5,000 రూపాయల జరిమానా విధించింది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more