జమ్మూకశ్మీర్ కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370 రద్దు చేస్తూ కేంద్రంలోని బీజేపి నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం తీసుకున్న చారిత్రాత్మక నిర్ణయంపై కాంగ్రెస్ మాజీ అధ్యక్షులు, అగ్రనేత రాహుల్ గాంధీ స్పందించారు. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్రజాప్రతినిధులను నిర్బంధించి, రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తూ రాష్రంగా వున్న జమ్మూకాశ్మీర్ ను ఏకపక్షంగా రెండు ముక్కలు చేసి.. కేంద్రపాలిత ప్రాంతాలుగా మార్చినంత మాత్రాన జాతీయ సమగ్రత సాకారం కాదని విమర్శించారు.
ఈ దేశం ప్రజలతో నిర్మితమైందని, దేశమంటే హద్దురాళ్లతో కూడిన భూములు కాదని మండిపడ్డారు. కార్యనిర్వాహక శక్తి దుర్వినియోగంతో జాతీయ భద్రతకు సమాధి కట్టారని ఆయన ఘాటుగా వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు రాహుల్ గాంధీ తన ట్విట్టర్ ఖాతా లో జమ్మూకాశ్మీర్ అంశంపై తొలిసారి స్పందించారు. అర్టికల్ 370, ఆర్టికల్ 35 ఏ లను రద్దు చేస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయంపై మాత్రం ఆయన స్పందించలేదు. అయితే కేవలం ఈ తీర్మాణాలను అమలుపర్చేందుకు కేంద్రం వ్యవహరించిన తీరుపైనే ఆయన ఘాటు విమర్శలు చేశారు.
కాశ్మీర్ పరిణామాలను నిశితంగా గమనిస్తున్నాం: అమెరికా
జమ్ముకశ్మీర్ విషయంలో చోటుచేసుకుంటున్న పరిణామాలను నిశితంగా గమనిస్తున్నామని అమెరికా విదేశాంగశాఖ తెలిపింది. అయితే, ఇది పూర్తిగా భారత్ కు సంబంధించిన అంతర్గత వ్యవహారమని స్పష్టం చేసింది. అయితే, కొందరు రాజకీయవేత్తలను అరెస్ట్ చేశారనే వార్తలు మాత్రం ఆందోళన కలిగిస్తున్నాయని యూఎస్ విదేశాంగశాఖ అధికార ప్రతినిధి మోర్గాన్ అన్నారు. జమ్ముకశ్మీర్ లో రాజ్యంగపరమైన మార్పులు తీసుకురావడం, రాష్ట్రాన్ని రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా విడగొట్టడంపై భారత్ తమకు వివరించిందని చెప్పారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more