జనసేన పార్టీ కార్యకర్తలపై జరుగుతున్న దాడులను సహించబోమని ఆ పార్టీ నేత నాగబాబు అన్నారు. పశ్చిమగోదావరి జిల్లా నరసాపురంలో పర్యటించిన ఆయన ఈ మేరకు వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన ఆయన, కార్యకర్తల్లో ఆత్మస్థైర్యం నింపేందుకే తాను ఇక్కడికి వచ్చానని చెప్పారు. అధికారంలో ఉన్న వారికి పోలీసులు సపోర్టు చేస్తే చేయొచ్చు గానీ, లేనిపోని కేసులు బనాయించడం కరెక్టు కాదని అన్నారు.
అధికారంలోకి వచ్చిన వాళ్లు ఎంత బాగా పరిపాలన చేస్తారన్నదే ముఖ్యం తప్ప, ప్రతీకారచర్యలకు పాల్పడటం సబబు కాదని అన్నారు. తమ కార్యకర్తలపై కేసులు బనాయిస్తున్నారని తెలిసిందని, అలా చేయకుండా ఆపాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని అన్నారు. శృతి మించితే మాత్రం తాము కూడా స్పందించాల్సి వస్తుందని హెచ్చరించారు. ఈ సందర్భంగా ఆయన కీలక నిర్ణయం తీసుకున్నారు. తాను ప్రాతినిథ్యం వహించిన నర్సాపురం పార్లమంటు ప్రాంతం ప్రజలకు, తమ కార్యకర్తలకు అండగా నెలలో వారం రోజుల పాటు అక్కడే వుంటానని అన్నారు.
స్థానిక సంస్థల ఎన్నికలల్లో తమ పార్టీ ఒంటరిగానే పోటీ చేస్తుందని ఆయన వెల్లడించారు. ఏ పార్టీతోనూ పొత్తు పెట్టుకునే ప్రసక్తి లేదని అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా వ్యూహాలు రచిస్తామని, ‘జనసేన’ గట్టి పోటీ ఇస్తుందని చెప్పారు. ఇక మరోవైపు జనసేన అధినేత పవన్ కల్యాణ్.. పార్టీని క్షేత్రస్థాయి నుంచి బలోపేతం చేసేందుకు చర్యలు చేపట్టారు. నాదెండ్ల మనోహర్ చైర్మన్గా 12 మంది సభ్యులతో పొలిటికల్ అఫైర్స్ కమిటీని రూపొందించారు.
అలాగే నలుగురు సభ్యులతో పొలిట్ బ్యూరోను ఏర్పాటు చేశారు. క్రమశిక్షణ సంఘం చైర్మన్గా మాదాసు గంగాధరంను నియమించారు. ఇక పొలిటిబ్యూరోలో నాదెండ్ల మనోహర్తో పాటు రాజు రవితేజ్, పి.రామ్మోహన్రావు, అర్హంఖాన్లను నియమించారు. పొలిటికల్ అఫైర్స్ కమిటీలో కొణిదెల నాగబాబు, రాపాక వరప్రసాద్, కోన తాతారావు, పాలవలస యశస్విని, మనుక్రాంత్రెడ్డి, బి. నాయకర్, తోట చంద్రశేఖర్, కందుల దుర్గేష్, ముత్తా శశిధర్, పసుపులేటి హరిప్రసాద్, ఎ. భరత్ భూషణ్ ఉన్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more