టీఆర్ఎస్ ప్రభుత్వంపైనా, ముఖ్యమంత్రి కేసీఆర్పైనా కాంగ్రెస్ నాయకురాలు, దేవుడిచ్చిన చెల్లి విజయశాంతి మరోమారు తీవ్రస్థాయిలో గరమయ్యారు. టీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకుంటున్న ప్రజావ్యతిరేక విధానాలను, నిర్ణయాలను వ్యతిరేకిస్తే ప్రతిపక్ష నేతలైనా సరే జైలుకు పంపుతామని అప్పట్లో కేసీఆర్ హెచ్చరించారని విజయశాంతి గుర్తు చేశారు. అయితే ప్రస్తుతం కేసీఆర్ తీసుకువచ్చిన కొత్త మున్సిఫల్ చట్టాన్ని వ్యతిరేకించిన వారిని ఆయన ఏం చేయగలరని ఆమె ప్రశ్నించారు.
ప్రతిపక్ష పార్టీల నుంచి అక్రమంగా ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తున్న కేసీఆర్.. ఇది ప్రజాస్వామ విధానాలకు లోబడే జరుగుతుందిని చెప్పుకోవడం చూస్తే.. ఉమ్మడి రాష్ట్రంలో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను తమ పార్టీలోకి కలుపుకోవడం కూడా సబబేనని సమర్థించకుండా.. ఆయనపై అరోపణలు, విమర్శలు ఎందుకు చేశారని, అదే అసెంబ్లీ సాక్షిగా ఎందుకు అంగలార్చారని విజయశాంతి ప్రశ్నించారు.
ఇంతకాలం కేసీఆర్ను వెనకేసుకొచ్చిన గవర్నర్ నరసింహన్ ఇప్పుడు తన వైఖరిని మార్చుకుని కేసీఆర్కు షాకిచ్చారన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తున్న తప్పులు శిశుపాలుడి తప్పులను మించిపోతున్నాయని ఆరోపించారు. ఈ విషయాన్ని ఇప్పటికైనా గవర్నర్ గుర్తించడాన్ని అమె స్వాగతించారు. మునిసిపల్ చట్టం రద్దు విషయంలో కేసీఆర్ సర్కారుకు గవర్నర్ ఊహించని ఝలక్ ఇచ్చారన్నారు.
ఇప్పటికైనా కేసీఆర్ తన తప్పుల్ని తెలుసుకుని, సరిదిద్దుకోవాలని సూచించారు. లేదంటే భవిష్యత్తులో భారీ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. ప్రభుత్వం తీసుకున్న కొన్ని నిర్ణయాలను హైకోర్టు కూడా తప్పుబట్టిందని, కొన్ని జీవోలను కూడా రద్దు చేసిందని ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఇంత జరిగినా నిమ్మకు నీరెత్తినట్టు మొండి వైఖరి అనుసరిస్తోందని విమర్శించారు. ఇప్పటికైనా కేసీఆర్ తన నియంతృత్వ ధోరణిని విడనాడాలని విజయశాంతి హితవు పలికారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more