అతివేగం తొమ్మిది మంది విద్యార్థుల ప్రాణాలను బలిగోన్న ఘటన మహారాష్ట్రలోని పూణె శివార్లలో శనివారం వేకువ జామున జరిగింది. ఈ ఘోర రోడ్డు ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న తొమ్మది మంది విద్యార్థులు దుర్మరణం పాలయ్యారు. ఎదురుగా వస్తున్న లారీ అతివేగంగా వచ్చి కారును ఢీకొనడంతోనే ప్రమాదం జరిగిందని స్థానిక పోలీసు అధికారులు ప్రాథమికంగా నిర్ధారించారు.
కారులో విద్యార్థులు రాయ్ గడ్ కు వెళ్లి తిరిగి తమ స్వగ్రామం యవత్ కు తిరిగి వస్తున్న క్రమంలో.. పూణె-షోలాపూర్ జాతీయ రహదారిపై మితిమీరిన వేగంతో వస్తున్న లారీ కారును ఢీకొనింది. పూణె శివారులోని కదంవక్ వాస్తి గ్రామ సమీపంలో సరిగ్గా అర్థరాత్రి 1.30 నుంచి 2 గంటల మధ్య ఈ ఘటన సంభవించింది. దీంతో కారులో ప్రయాణిస్తున్న విద్యార్థులందరూ అక్కడికక్కడే మృతిచెందారు. లారీ డ్రైవర్ మద్యం సేవించి వాహనాన్ని నడుపుతున్నాడా.? అన్న అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి.
విద్యార్థులందరూ యావత్ గ్రామానికి చెందినవారే కావడంతో ఆ గ్రామంలో విషాధఛాయలు అలుముకున్నాయి. వీరంతా 19 నుంచి 23 ఏళ్ల మధ్యవయస్కులేనని నిర్థారించిన పోలీసులు వారి తల్లిదండ్రులకు సమాచారం అందించి.. విద్యార్థుల మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం స్థానిక పోలిస్ స్టేషన్ కు తరలించారు. కేసు నమోదు చేసుకున్న లోనిఖాల్ బోర్ పోలీసులు.. లారీ డ్రైవర్ పరారీలో వున్నాడని తెలిపారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more