Kumaraswamy Ready to Seek Trust Vote in Karnataka Assembly బలపరీక్షకు సిద్ధమన్న కుమారస్వామి

Kumaraswamy ready to seek trust vote in karnataka assembly

Kumaraswamy, karnataka, speaker

Kumaraswamy Ready to Seek Trust Vote in Karnataka Assembly

బలపరీక్షకు సిద్ధమన్న కుమారస్వామి

Posted: 07/12/2019 04:49 PM IST
Kumaraswamy ready to seek trust vote in karnataka assembly

కన్నడ రాజకీయాలు కీలక మలుపు తిరిగాయి. జేడీఎస్‌-కాంగ్రెస్‌ సంకీర్ణ సర్కార్‌ సంక్షోభంలో కూరుకుపోయిన క్రమంలో అసెంబ్లీలో బలపరీక్షకు సిద్ధమని, సమయం ఖరారు చేయాలని ముఖ్యమంత్రి కుమారస్వామి శుక్రవారం అసెంబ్లీ స్పీకర్‌ రమేష్‌ కుమార్‌ను కోరారు. శాసనసభలో తాను బలం నిరూపించుకుంటానని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. ఆర్థిక బిల్లును ఆమోదించేందుకు శుక్రవారం శాసనసభ సమావేశాలు ప్రారంభం కావడంతో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. కర్ణాటకలో మొత్తం 224 మంది ఎమ్మెల్యేలున్నారు. వీరిలో 16 మంది రాజీనామాలు చేశారు. అయితే వీరి రాజీనామాలను స్పీకర్‌ ఇప్పుడు అంగీకరించకూడదు గనుక మంగళవారం వరకు ఎమ్మెల్యేలుగానే ఉంటారు. శాసనసభలో భాజపా సంఖ్యా బలం 107, రాజీనామా చేసిన ఎమ్మెల్యేలను తీసేస్తే సంకీర్ణం సంఖ్యా బలం 100. ఇలాంటి సమయంలో బలపరీక్షలో కుమారస్వామి నెగ్గుతారో లేదో చూడాలి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Kumaraswamy  karnataka  speaker  

Other Articles