ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) మహాసభలకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాజకీయాల్లోకి రావడానికి కారణాలను వివరించారు. అలాగే ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో అపజయం గురించి కూడా ప్రస్తావించారు.గొంతుక వినిపించడానికే తాను రాజకీయాల్లోకి వచ్చినట్టు పవన్ వివరించారు. నీతి, నిజాయితీతో కూడిన రాజకీయాలే తన కర్తవ్యమని పేర్కొన్నారు.
ఓట్లకు నోట్లు ఇచ్చి గెలిచిన పార్టీలు అధికారాన్ని పొందుతున్నాయనీ... అలాంటి పార్టీలు అధికారంలోకి వచ్చాక... ప్రజలను పట్టించుకోవట్లేదనీ, ఆల్రెడీ డబ్బు ఇచ్చాం కాబట్టే తమకు ఓటు వేశారన్న ఆలోచనా ధోరణితో ఉంటున్నాయని విమర్శించారు.డబ్బులిచ్చి ఓట్లు సంపాదించి గెలవడం కంటే... డబ్బులు ఇవ్వకుండా... ఓట్లు రాకుండా ఓడిపోయినా... ఆ అపజయాన్ని తాను సంతోషంగా స్వీకరిస్తానని అన్నారు. జైల్లో కూర్చొని వచ్చిన వాళ్లు ఇప్పుడు హ్యాపీగా ఉంటున్నప్పుడు... ఏ తప్పూ చేయని, సత్యం మాట్లాడే తాను ఎందుకు బాధపడాలని... పరోక్షంగా ఓ పార్టీని టార్గెట్ చేశారు పవన్ కళ్యాణ్. అలాగే సక్సెస్ తనకు ఎంత పాఠం నేర్పిందో తెలియదు కానీ, చిన్నతనం నుంచి ఫెల్యూర్స్కు తనకు అనే పాఠాలు నేర్పాయని పవన్ వ్యాఖ్యానించారు. ప్రతి ఓటమీ తనను విజయానికి దగ్గర చేసిందని అన్నారు. కుంభకోణాలు చేస్తూ, ద్రోహాలు చేసి తాను రాజకీయాల్లోకి రాలేదని, విలువల కోసం నిలబడ్డానని అందుకే ఓటమిని సంతోషంగా స్వీకరించానని పేర్కొన్నారు. తనకు తానుగా అన్ని విషయాలను నేర్చుకున్నానని, అప్పటి నుంచి సమాజం కోసం పనిచేయాలని కోరిక ఏర్పడిందని తెలిపారు.ఓటుకు నోటు విధానాన్ని ప్రతి ఒక్కరూ వ్యతిరేకించాలని కోరారు. ఖుషి సినిమా తర్వాత... రాజకీయాల్లోకి వచ్చి... యువతను చైతన్య పరచాలనే ఉద్దేశంతో నిర్ణయం తీసుకున్నానన్న ఆయన... స్వామి వివేకానంద స్ఫూర్తితో... ఎంతో ఆలోచించి జనసేన పార్టీ పెట్టానన్నారు. ఎవరు ఎన్ని దెబ్బలు కొట్టినా... వెనకడుగు వేయకూడదన్న బలమైన కాంక్షతో తాను ఉన్నట్లు తెలిపారు. జనసేన ఓటమి తర్వాత... ఆ అపజయాన్ని జీర్ణించుకోవడానికి తనకు 15 నిమిషాలే పట్టిందన్న పవన్... తాను స్కాములు చేసి ఎన్నికల్లో పోటీ చేయలేదని అన్నారు. ఈ పోరాటంలో ఎదురుదెబ్బలు తగలొచ్చని, నలిగిపోవచ్చని అయినా సరే వెనుకడగు వేసే ప్రసక్తేలేదని పవన్ ఉద్ఘాటించారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more