వైఎస్సార్ కాంగ్రెస్ శాసనసభాపక్ష నేతగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎన్నికయ్యారు. జగన్ ని తమ పార్టీ ఎల్పీ నేతగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. తాడేపల్లిలోని వైసీపీ కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఆయన ఎన్నిక లాంఛనమే అయినా ప్రోటోకాల్ ప్రకారం ఎన్నుకున్నారు. వెఎస్సార్ ఎల్పీ నేతగా జగన్ ను బొత్స సత్యనారాయణ ప్రతిపాదించగా, ధర్మాన ప్రసాదరావు, ఆదిమూలపు సురేశ్, పార్ధసారథి బలపరిచారు. ఏకవాక్య తీర్మానంతో వైఎస్సార్ ఎల్పీ నేతగా జగన్ ని ఎన్నుకుంటున్నట్టు ప్రకటించారు. దీంతో ఈయన వైఎస్సార్ ఎల్సీ నేత ఎన్నిక పూర్తైయ్యింది.
కాగా, ఈ రోజు సాయంత్రం ఆంధ్రప్రదేశ్ కాబోయే ముఖ్యమంత్రి జగన్.. సీఎం పగ్గాలు చేపట్టకముందే ఇటు తెలంగాణకు చేరుకోనున్నారు. హైదరాబాద్ కు చేరుకోనున్న జగన్ తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ తో భేటీ కానున్నారు. అలాగే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిండెంట్ వైఎస్ జగన్ తోనూ భేటీ కానున్నారు. ఆ తరువాత ఆయన ఆదివారం తిరిగి అమరావతికి చేరుకోనున్నారని సమాచారం.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైసీపీ సాధించిన భారీ మెజార్టీ చరిత్రలో సువర్ణ అక్షరాలతో లిఖించదగ్గ అధ్యాయమని, ఇది తన ఒక్కడి విజయం కాదని, పార్టీ నేతలు, నాయకులు, కార్యకర్తలు కలిసి సాధించిన గెలుపు అని వైసీపీ అధినేత జగన్ అన్నారు. తాడేపల్లిలోని వైసీపీ కార్యాలయంలో వైఎస్సార్ ఎల్పీ నేతగా ఆయన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అనంతరం, జగన్ మాట్లాడుతూ, ఈ విజయానికి కారణం తనతో పాటు కష్టపడ్డ నేతలు, నాయకులు, కార్యకర్తలు అని అన్నారు.
ప్రతి గ్రామంలోని కార్యకర్త తనకు తోడుగా ఉండటంతోనే ఈ విజయం సాధ్యమైందని చెప్పారు. ప్రజలకు ఏరకమైన కష్టాలు వచ్చినా అండగా నిలిచిందని వైసీపీయేనని అన్నారు. దేశం మొత్తం మన పాలన వైపు చూసేలా పని చేస్తామని, సుపరిపాలనకు మీ అందరి సహాయసహకారాలు కావాలని కోరారు. ఈ సందర్భంగా తనను శాసనసభా పక్ష నాయకుడిగా ఎన్నుకున్న ఎమ్మెల్యేలకు ధన్యవాదాలు తెలియజేశారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more