సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ నాయకత్వంలోని ఎన్డీయే కూటమి 355 స్థానాలు లభించడం ప్రపంచ ప్రజాస్వామ్య చరిత్రలోనే అతిపెద్ద ఘట్టం అని ప్రధాని నరేంద్రమోడీ అభివర్ణించారు. బీజేపీకి సొంతంగా అత్యధిక స్థానాలు వచ్చినా సమాఖ్య స్ఫూర్తికి కట్టుబడి ఉంటుందని మోదీ స్పష్టం చేశారు. ఇది సామాన్య ప్రజల విజయమని, నిజాయితీ గల ప్రజల తీర్పని అయన పేర్కోన్నారు. ఇది బీజేపి పార్టీ సాధించిన విజయమో లేక నరేంద్రమోడీ సాధించిన విజయమో కాదని ఇది పూర్తిగా ప్రజావిజయమని ఆయన అన్నారు.
ఢిల్లీలోని బీజేపీ ప్రధాన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విజయోత్సవ సభలో ఆయన మాట్లాడుతూ మరింత మెరుగైన జీవనం కోరుకుంటున్న సామాన్యుల విజయంగా పేర్కోన్నారు. మోదీ సర్కారు ఈ ఐదేళ్లలో తమ కోసమే పనిచేసిందని ప్రజలు విశ్వసించారని తెలిపారు. బీజేపీ దార్శనికతను ప్రతిబింబించేలా పనిచేశామని, ప్రజలు సైతం సాధికారత కోసం ఓట్లేశారని వివరించారు. ఎన్డీఏ కూటమిపై నమ్మకం ఉంచిన దేశ ప్రజలకు ప్రధాని మోదీ ధన్యవాదాలు తెలిపారు. ప్రజలు కట్టబెట్టిన ఘన విజయం తమకు మరింత బాధ్యత పెంచిందనీ.. ప్రజల ఆకాంక్షలను నిజం చేయడానికి మరింత కష్టపడతామని వెల్లడించారు.
ఈ సందర్భంగా ఆయన ఎన్నికలను ఎంతో పారదర్శకంగా, సాఫీగా జరిగేలా చూసిన ఎన్నికల సంఘానికి ధన్యవాదాలు తెలిపారు. భారీ ప్రజాసామ్య క్రతువులో పాల్గొన్న ఓటర్లకు, అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భద్రత విధులు నిర్వహించిన బలగాలకు అభినందనలు తెలియజేశారు. ఈ ఎన్నికల్లో తమను ఎన్నుకునేందుకు యావత్ భారతం ఏకమైందని కొనియాడారు. నవభారతానికి ఇది శిలాశాసనం లాంటి విజయం అని మోదీ అభివర్ణించారు. ఈ విజయం తనను దేశ ప్రజల కోసం మరింతగా శ్రమించేందుకు సిద్దం చేస్తోందని అన్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more