చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజకవర్గంలోని ఐదు పోలింగ్ బూత్ ల పరిధిలో తనకు అనుకూలంగా ఓట్లు పడలేదని అనుమానంతో.. అక్కడి ఓ వర్గం వారు ఓటింగ్ కు దూరంగా వుండేలా గ్రామస్థులు అడ్డుకున్నారని, వారికి ఓటు హక్కు కల్పించాలని ఎన్నికల సంఘం అధికారులకు కలసి విన్నవించిన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి అధికారుల పరంగా అంతా కలసివచ్చినా.. ఓటర్ల నుంచే చుక్కెదరువుతుంది. ఎన్నికల సంఘం అధికారులు ఇలా రీ-పోలింగ్ కు అనుమతి ఇచ్చారో లేదో.. అలా గ్రామాల్లోకి వెళ్లి ప్రచారం చేసుకునేందుకు వెళ్లిన ఆయనకు గ్రామస్థుల నుంచి తీవ్ర నిరసన వ్యక్తం అయ్యింది.
గురువారం రోజు రాత్రి చెలరేగిన ఉద్రిక్తత ఇంకా చల్లారలేదు. నియోజకవర్గంలోని ఎన్ఆర్ కమ్మపల్లెలో ఇవాళ మరోమారు గ్రామస్థులను ప్రసన్నం చేసుకుని వారి ఓట్లను తన ఖాతాలోకి మళ్లించుకుందామని ఆయన చేసిన ప్రయత్నాలు మరోమారు బెడిసికోట్టాయి. ఇవాళ ఆయన రాక సందర్భంగా మరోమారు కమ్మపల్లెలో ఉద్రిక్త వాతావరణం అలుముకుంది. ఇవాళ ఉదయం అనుచరులతో కలిసి వైసీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మరోసారి ఎన్ఆర్ కమ్మపల్లె గ్రామంలోకి వచ్చేందుకు ప్రయత్నించగా, స్థానికులు అడ్డుకున్నారు. బయటవారిని ఊరిలోకి తీసుకొచ్చి ఉద్రిక్త పరిస్థితులు సృష్టిస్తున్నారని చెవిరెడ్డిపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
‘మా ఊరిలోకి వచ్చి మీరు ప్రచారం నిర్వహించాల్సిన అవసరం లేదు. మీకు ఓట్లు పడలేదన్న కారణంతో మళ్లీ మా ఊరిలో రీపోలింగ్ నిర్వహించాలని మీరు ఫిర్యాదు చేశారు. ఇక్కడ పోలింగ్ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగలేదు’ అని స్పష్టం చేశారు. దీంతో ఎన్ఆర్ కమ్మపల్లెకు చెందిన కొందరు వ్యక్తులు, చెవిరెడ్డి వర్గీయులు వాగ్వాదానికి దిగగా, ఇరువర్గాలను పోలీసులు సముదాయించారు. నిన్న రాత్రి కూడా ఇదే తరహాలో చెవిరెడ్డిని ఎన్ఆర్ కమ్మపల్లె వాసులు అడ్డుకున్నారు. ఎన్ఆర్ కమ్మపల్లె, కమ్మపల్లె, పులివర్తి పల్లె, కొత్త కండ్రిగ, వెంకట్రామాపురం గ్రామాల్లోని ఐదు పోలింగ్ కేంద్రాల్లో ఈ నెల 19న ఎన్నికలు నిర్వహించాలని ఈసీ నిర్ణయించింది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more