కర్నూలు జిల్లాలో 44వ నంబర్ జాతీయ రహదారి రక్తమోడింది. వెల్దుర్తి క్రాస్ రోడ్డు వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 14 మంది దుర్మరణం పాలయ్యారు. ప్రైవేట్ వోల్వో బస్సు అదుపుతప్పి ఎదురుగా వస్తున్న జీపును ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. బైక్ను తప్పించే క్రమంలో బస్సు డ్రైవర్ ఒక్కసారిగా స్టీరింగ్ను తిప్పడంతో.. బస్సు అదుపుతప్పి డివైడర్ మీదుగా దూసుకెళ్లి ఎదురుగా వస్తున్న జీపును బలంగా ఢీకొట్టింది. ప్రమాద సమయంలో ఇరు వాహనాలు గంటకు 120 కి.మీ. పైగా వేగంతో ఉన్నట్లు తెలుస్తోంది.
మృతులంతా జోగులాంబ గద్వాల జిల్లా వడ్డేపల్లి మండలం రామాపురం గ్రామానికి చెందినవారిగా తెలుస్తోంది. రామాపురం గ్రామానికి చెందిన ఓ కుటుంబం కొంత మంది తమ బంధువులతో కలిసి పెళ్లిచూపుల కార్యక్రమానికి వెళ్లి తిరిగి వస్తుండగా.. ఈ దారుణ ఘటన చోటుచేసుకుంది. పెళ్లి విషయాలు మాట్లాడుకుంటూ అప్పటివరకు ఆనందంలో మునిగితేలిన వారు.. క్షణాల్లో జరిగిన పరిణామాలతో విఘతజీవులుగా మారిపోయారు. ప్రమాదం వార్త తెలిసి రామాపురం గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
ప్రమాదంతో తీవ్రంగా గాయపడిన మరో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ప్రమాద సమయంలో తుఫాన్ వాహనంలో 15 మంది ఉన్నట్లు సమాచారం. వీరిలో 13 మంది అక్కడికక్కడే మరణించగా.. మరో వ్యక్తి గాయాలతో బయటపడ్డాడు. బైక్పై ప్రయాణిస్తున్న ఇద్దరు వ్యక్తులకు తీవ్రంగా గాయాలయ్యాయి. వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులను సమీపంలోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అక్కడ చికిత్స పొందుతూ మరొో వ్యక్తి మృత్యువాత పడ్డాడు.
ప్రమాదానికి కారణమైన బస్సను ఎస్సార్ఎస్ ట్రావెల్స్ కు చెందినదిగా గుర్తించారు. అతివేగం కారణంగానే ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ప్రమాద తీవ్రతతో ఘటనా స్థలి భీతావహంగా మారింది. తుఫాన్ వాహనంలో మృతదేహాలన్నీ ఇరుక్కుపోయాయి. స్థానికులు హుటాహుటిన స్పందించి సహాయ కార్యక్రమాలు అందించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకొని క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more