అరుణాచల్ ప్రదేశ్లోని పశ్చిమ కమెంగ్ జిల్లాలో పరిశోధకులు ఓ అరుదైన సరీసృప జాతికి చెందిన పామును గుర్తించారు. ముదురు ఎరుపు-గోధుమ రంగులతో ఉండే ఈ అరుదైన జాతికి చెందిన సరీసృపాన్ని ‘పిట్ వైపర్’ అని పిలుస్తారు. భారత్ లో ఇటువంటి పాములను ఇంతకు ముందు కేవలం నాలుగింటిని మాత్రమే గుర్తించారు. ఆ నాలుగింటిని 70 ఏళ్ల క్రితం గుర్తించారు. తాజాగా, ‘విట్ వైపర్స్’ జాతికి చెందిన పామును అశోక్ కెప్టెన్ నేతృత్వంలోని సరీసృప శాస్త్ర అధ్యయన పరిశోధకులు గుర్తించారు.
ఈ విషపూరిత పాముకి ప్రత్యేకమైన హీట్ సెన్సింగ్ ఉంటుందని తెలిపారు. అంటే అన్ని పాములకు ఇది భిన్నం. అన్ని పాములు తమ వద్దకు వచ్చే జీవుల కదలికలను వాటి తరంగాల ద్వారా గుర్తిస్తాయి. కానీ ఈ పాము మాత్రం తలతోనే గుర్తిస్తుంది. ఈ విషయంపై అక్కడి అటవీశాఖ అధికారులు శుక్రవారం ప్రకటన చేశారు. ‘అరుణాచల్ ప్రదేశ్లో పిట్ వైపర్స్ ఉన్నాయన్న విషయం ఇంత వరకు తెలియదు. ఈ అరుదైన సరీసృపాలపై చేసే మరిన్ని సర్వేలు, పరిశోధనలు పలు విషయాలను తేలుస్తాయి.
పిట్ వైపర్ అలవాట్లు, అవి తీసుకునే ఆహారం, సంతానోత్పత్తి, అవి గుడ్లు పెడతాయా? లేదా? అన్న విషయాలను తెలుసుకోవాల్సి ఉంది’ అని పరిశోధకులు తెలిపారు. పుణెకు చెందిన ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ బృందం అరుణాచల్ ప్రదేశ్లో జీవవైవిధ్య సర్వే నిర్వహిస్తున్న నేపథ్యంలో ఈ పాము వారికి కనపడింది. ఆ బృందానికి అటవీ ప్రాంతంలోని రందా గ్రామంలో ఓ వ్యక్తి.. ఆ పామును చూపించడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. దీనిపై మరిన్ని పరిశోధనలు చేయనున్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more