రష్యాలోని మాస్కోలో జరిగిన ఘోర విమాన ప్రమాదంలో 41 మంది మృతి చెందారు. టేకాఫ్ అయిన విమానంలో సాంకేతిక లోపం తలెత్తడంతో ఎమర్జెన్సీ ల్యాండింగ్ కోసం పైలెట్ ప్రయత్నిస్తుండగానే అది అక్కడికక్కడే కుప్పకూలింది. దీంతో ఒక్కఉదుటున మంటలు వ్యాపించడంతో.. విమానంలోని సుమారు 41 మంది ప్రయాణికులు మంటల్లో సజీవదహనమయ్యారు. ఆరుగురు గాయపడ్డారు. రష్యా రాజధాని మాస్కోలోని షేరెమెట్యావో విమానాశ్రయంలో ఈ ప్రమాదం జరిగింది.
రష్యాకు చెందిన ఎరోఫ్లాట్ సుఖోయ్ సూపర్ జెట్ విమానం విమానాశ్రయం నుంచి టేకాఫ్ అయింది. అయితే, ఆ తర్వాత కాసేపటికే విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో విమానాన్ని అత్యవసర ల్యాండింగ్కు పైలట్లు ప్రయత్నించారు. ఈ క్రమంలో విమానం నేలను బలంగా ఢీకొనడంతో మంటలు చెలరేగాయని రష్యా దర్యాప్తు కమిటీ అధికార ప్రతినిధి ఎలినా మార్కోవక్యాయా తెలిపారు.
కాగా ఈ ప్రమాదం సంభవించినప్పుడు విమానంలో మొత్తంగా 73 మంది ప్రయాణికులు వున్నారని, వీరితో పాటు ఐదుగురు విమాన సిబ్బంది వున్నారని అమె వెల్లడించారు. వీరిలో 41 మంది సజీవ దహనమయ్యారు. మిగిలిన 37 మంది ప్రాణాలతో బయటపడ్డారని, వీరిలో ఆరుగురు గాయపడ్డారని అధికారులు వివరించారు. మృతుల్లో ఇద్దరు చిన్నారులతో పాటు ఒక విమాన సిబ్బంది కూడా ఉన్నారని అధికారులు పేర్కొన్నారు.
An Aeroflot plane with 73 passengers and 5 crew members landed in flames at Moscow's Sheremetevo Airport, killing as many as 41 people, according to Russian media pic.twitter.com/5PObPKHGZI @tictoc
— Karim RAFFA (@WinkySolutions) May 6, 2019
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more