చారిత్రక కట్టడం, హైదరాబాద్కే తలమానికం అయిన చార్మినార్ కట్టడంలోని చిన్న భాగం కూలింది. నాలుగు మినార్లలోని ఒక మినార్ నుంచి సున్నపురాయి కట్టడం విరిగిపోయి కింద పడింది. ఆ సమయంలో చార్మినార్ వద్ద పర్యాటకులు ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పింది. బుధవారం అర్ధరాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది. వెంటనే స్పందించిన పోలీసులు, పురావస్తు శాఖ అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని మినార్ నుంచి కిందపడిన భాగాన్ని సేకరించి భద్రపరిచారు.
చార్మినార్ ఉదయం పూట వీక్షించేందుకు వీలుపడదని, ట్రాఫిక్ లో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని ఈ చారిత్రిక కట్టడాన్ని వీక్షించేందుకు రాత్రివేళను అధికా మంది పర్యాటకు ప్రాధాన్యత ఇస్తారు. అయితే అలా పర్యాటకులు లేని సమయంలో ఈ మినార్ నుంచి చిన్న భాగం కూలి కిందపడింది. ఈ ఘటనతో ప్రతినిత్యం అక్కడే వుండి జీవనోపాధి చూసుకునే చిరువ్యాపారులు, ప్రజలు భయాందోళనకు గురయ్యారు. కాలుష్యం కారుణంగా చార్మినార్ రంగు వెలిసిపోవడంతో పురావస్తు శాఖ మరమ్మత్తులు చేపట్టింది. గత సంవత్సర కాలంగా మినార్లను శుభ్రం చేయించి రంగులు వేయిస్తోంది. ఈ విధంగా శుభ్రం చేసి, రంగు వేసిన ఒక మినార్ నుంచి చిన్న భాగం ఇప్పుడు కూలింది.
చార్ సౌ సాల్ షహర్ కు ప్రతీరూపం చార్మినార్
హైదరాబాద్ పేరు చెప్పగానే గుర్తొచ్చేది చార్మినార్. నిత్యం దేశ, విదేశీ పర్యాటకులు చార్మినార్ను చూడటానికి వస్తుంటారు. భాగ్యనగర నిర్మాత, కుతుబ్షాహీ సామ్రాజ్యానికి ఐదో సుల్తాన్ అయిన మహ్మద్ కులీ కుతుబ్షా క్రీ.శ. 1591లో దీన్ని నిర్మించారు. అంటే చార్మినార్ నిర్మించి సుమారు 428 సంవత్సరాలైంది. ఈ నిర్మాణానికి గల కారణాలు అనేకంగా ప్రచారంలో ఉన్నాయి. ఒకప్పుడు ప్లేగు వ్యాధి ఎక్కువగా ప్రబలింది. ఆ వ్యాధి పూర్తిగా నయమైన శుభవేళను కలకాలం గుర్తుంచుకోవాలనే ఉద్దేశంతో చార్మినార్ నిర్మాణం జరిగిందని కొందరు చెబితే.. కుతుబ్షాహీ పాలకుల విజయ వైభవానికి ప్రధాన సింహద్వారంలాగా చార్మినార్ నిర్మించారని ఇంకొందరు చెబుతున్నారు.
When a chunk of history falls, it is reason for concern & contemplation: piece of one of the minarets of the historic #Charminar fell last night causing concern about structural stability of 400-year-old monument among archaeologists police also worried about safety @ndtv pic.twitter.com/fNQh7UafRl
— Uma Sudhir (@umasudhir) May 2, 2019
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more