నంద్యాల నుంచి వరుసగా మూడుసార్లు గెలుపొందిన ఎస్పీవై రెడ్డి.. మంచి మనస్సున్న నేతగా స్థానికులకు సుపరిచితులు. నంది పైపుల పరిశ్రమను స్థాపించి ఎంతోమందికి ఉపాధి అవకాశాలు కల్పించిన ఎస్పీవైని ఆ ప్రాంత వాసులు ‘పైపుల రెడ్డి’గానూ పిలుచుకుంటారు. అయితే, ఆయన అసలు పేరు మాత్రం సన్నపురెడ్డి పెద్ద ఎరుకలరెడ్డి. ఎస్పీవై రెడ్డి రాజకీయ నాయకుడిగానే కాకుండా సామాజికవేత్తగానూ గుర్తింపు పొందారు. నంద్యాల నియోజకవర్గంలో ఉచితంగా బోర్లు వేయించి సేవాతత్పరతను చాటుకున్నారు.
కర్నూలు జిల్లా కొత్తపల్లి మండలంలోని ప్రతి పొలంలో బోరు బావులు వేయించి, పైపులు.. మోటార్లు ఉచితంగా అందించి ఎంతోమంది రైతుల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు. అంతేకాదు అకలితో మరణాలు వుండకూడదని భావించిన ఆయన రూపాయికే జొన్నరొట్టె, పప్పు, మజ్జిగ, రూ.3కే కొబ్బరిబొండం పంపిణీ చేసి నిరుపేదల కడుపు నింపారు. ఇలా చెప్పుకుంటూ పోతే ఆయన సేవలు అసామాన్యం. హైదరాబాద్ బంజారాహిల్స్లోని కేర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆయన మరణించిన వార్తతో కర్నూలె విషాదాన్ని నింపింది.
కడసారి చూపుకోసం బారులు తీరిన స్థానికులు
నంద్యాల ప్రాంతంలో ఎంపీగా హ్యాట్రిక్ విజయాలతో పాటు నంద్యాల మునిసిపల్ చైర్మన్ గానూ సేవలందించిన ఎస్పీవై రెడ్డి భౌతికకాయం నంద్యాల శివారులోని బొమ్మలసత్రంలోని ఆయన ఇంటికి చేరింది. ఆయనకు కడసారి నివాళులు అర్పించేందుకు ప్రజలు భారీ ఎత్తున తరలివచ్చారు. నంద్యాల ప్రాంతంలో కరవు తాండవించిన వేళ, 'రొట్టె, పప్పు' కేంద్రాలను తెరిచి కేవలం రెండు రూపాయలకే లక్షల మంది ప్రజలకు ఆయన ఆహారాన్ని అందించారని గుర్తు చేసుకున్నారు. ఎంపీగా, మున్సిపల్ చైర్మన్ గా ఆయన చేసిన అభివృద్ధి పనులను కూడా ప్రజలు గుర్తు చేసుకుంటున్నారు.
నంద్యాలలో జరిగిన ప్రతి అభివృద్ధి పని వెనుకా ఆయనున్నారని తలచుకుని కన్నీరు పెట్టుకుంటున్నారు. ఆయన స్థాపించిన సంస్థల్లోని ఉద్యోగుల కోసం ఏకంగా ఎస్పీవై రెడ్డి కాలనీ పేరిట భారీ ఎత్తున స్థలాన్ని కొనుగోలు చేసి, ఉద్యోగులకు అత్యంత చౌకగా ఇంటి స్థలాలను అందించి, వారు ఇళ్లు కట్టుకునేందుకు సహకరించారు. నంది పైపులు, నంది డయిరీలతో పాటు ఆయన స్థాపించిన పాఠశాలల్లో పని చేస్తున్న ఉద్యోగులు పెద్దఎత్తున తరలివచ్చి తమ యజమానిని గుర్తు చేసుకుంటూ బోరున విలపిస్తున్నారు. ఎస్పీవై రెడ్డి అంత్యక్రియలు రేపు ఉదయం నంద్యాలలోనే జరుగుతాయని కుటుంబీకులు తెలిపారు.
ఎస్పీవై రెడ్డి ప్రస్థానం సాగిందిలా..
నంద్యాల ప్రజల గుండెల్లో సుస్థిర స్థానం ఏర్పాటు చేసుకున్న ‘పైపుల రెడ్డి’ ఎస్పీవై రెడ్డి.. అభివృద్ది పనులు, సామాజిక కార్యక్రమాలతో స్థానికంగా లబ్దిపోందని వారంటూ వుండరంటే అతిశయోక్తి కాదు. నంద్యాల పరిధిలోని ప్రతీఒక్కరు ఆయన సౌమ్యుడు, పెద్దవారు అని గౌరవిస్తున్నారంటే అదే అతని గొప్పతనం. జూన్ 4, 1950న కడప జిల్లా అంకాలమ్మ గూడూరులో జన్మించారు. వరంగల్ నిట్లో ఇంజినీరింగ్ చేసిన రెడ్డి ముంబైలోని బాబా ఆటమిక్ రీసెర్చ్ సెంటర్లో చేరారు. 1977లో ఉద్యోగానికి రాజీనామా చేసి ప్లాస్టిక్ కంటెయినర్ల ప్లాంటును నెలకొల్పారు. 1984లో నంది పీవీసీ పైపుల కంపెనీ ఏర్పాటు చేసి విశేష గుర్తింపు పొందారు.
ఎస్పీవై రెడ్డి రాజకీయ ప్రస్థానం బీజేపీతో ప్రారంభమైంది. 1991లో బీజేపీ తరపున పోటీ చేసిన ఆయన ఓటమి పాలయ్యారు. 1999లో నంద్యాల, గిద్దలూరు నుంచి స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగి రెండింటిలోనూ స్వల్ప ఓట్ల తేడాతో ఓడారు. 2000లో నంద్యాల మునిసిపల్ చైర్మన్ అభ్యర్థిగా కాంగ్రెస్ తరపున విజయం సాధించారు. ఆ తర్వాత 2004, 2009 సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున పోటీ చేసిన ఎస్పీవై విజయం సాధించారు. గత ఎన్నికల్లో వైసీపీ తరపున పోటీ చేసి విజయం సాధించారు. ఆ తర్వాత టీడీపీలో చేరారు. వరుసగా మూడుసార్లు గెలిచి హ్యాట్రిక్ కొట్టారు. ఈ ఎన్నికల్లో జనసేన అభ్యర్థిగా బరిలో ఉన్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more