పాకిస్థాన్ లోని బాలకోట్ లో భారత వాయుసేన అత్యంత వాయువేగంతో వెళ్లి జరిపిన సర్జికల్ దాడులపై ఇప్పటికే అటు విపక్షాలు ఇటు అధికార పక్షం మధ్య విమర్శలు, ప్రతివిమర్శలు చోటుచేసుకుంటున్నాయి. బాలకోట్ లో మూడు వందల మంది ఉగ్రవాద మూకలను భారత వాయుసేన మట్టుబెట్టిందని అధికార పక్షం.. ఒక్కరూ చనిపోలేదని అక్కడి మీడియా చెబుతోందని విపక్షాలు విపక్షాలు ప్రశ్నించడంతో పాటు బాలకోట్ దాడుల్లో ఎంతమంది మరణించార్న వివరాలుపై అధికారపక్షాన్ని నిలదీయడం.. దీంతో భారత అర్మీని, వాయుసేనను విపక్షాలు అవమానిస్తున్నాయిన అధికారపక్షం వారిపై విమర్శలు చేయడం కొనసాగుతూనే వుంది.
ఈ తరుణంలో మిజోరాం మాజీ గవర్నర్, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు అజీజ్ ఖురేషీ ప్రధాని నరేంద్రమోడీని టార్గెట్ గా చేసుకుని సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రధాని నరేంద్రమోడీ తన చేతిలో వున్న విజిలెన్స్ శాఖ సమర్థతను తప్పబట్టకుండా.. సర్జికల్ స్ట్రైక్స్ పేరుతో యావత్ దేశాన్ని.. అటు ప్రపంచాన్ని కూడా దృష్టిమళ్లించారని అన్నారు. అసలు పూల్వామా ఘటనలో పెద్ద కుట్ర వుందని అనుమానాలు వ్యక్తం చేసిన ఆయన.. అమరవీరుల ప్రాణత్యాగాలపై మళ్లి గద్దెనెక్కే యత్నం జరుగుతోందని అరోపించారు.
జమ్ముకశ్మీర్ రాష్ట్రం పుల్వామాలో పేలుడు ఘటన వెనుక పథక రచన అంతా ప్రధాని నరేంద్ర మోడీదేనని ఆయన అరోపించారు. లోక్సభ ఎన్నికలను దృష్టిలో పెట్టుకునే మోదీ ఈ పథక రచన చేశారని అజీజ్ ఖురేషీ ఆరోపించారు. భద్రతా బలగాల కళ్లు కప్పి దేశంలోకి ఉగ్రవాదులు వస్తేనే వారిపై దాడులు చేస్తూ మట్టుబెడుతున్న భద్రతా బలగాలకు తెలియకుండా పేలుడు పదార్థాలతో నింపిన కారు రాష్ట్రంలోకి ఎలా ప్రవేశించిందని ఆయన ప్రశ్నించారు.
పదుల సంఖ్యలో సైనికులు చనిపోతే తాను గెలవవచ్చునని మోదీ భావిస్తే దాన్ని ఓటర్లు తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. ఇటువంటి చర్యలను ప్రజలు అంగీకరించకూడదన్నారు. మధ్యప్రదేశ్లోని భోపాల్ నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి దిగ్విజయ్సింగ్పై బీజేపీ అభ్యర్థిని ఇంకా ప్రకటించక పోవడాన్నిఎద్దేవా చేశారు. దిగ్విజయ్పై ఓడిపోతామన్న భయంతోనే బీజేపీ నేతలు దీటైన నాయకుని కోసం వెతుకుతున్నారని అన్నారు.
#WATCH MP: Ex-Mizoram Guv Aziz Qureshi speaks on Pulwama attack&PM, says "Plan karke aapne ye karwaya taki apko mauka mile, lekin janta samajhti hai. Agar Modi ji chahein ki 42 jawanon ki hatya karke, unki chitaon ki raakh se apna rajtilak kar lein, janta nahi karne degi."(14.04) pic.twitter.com/WvQfFpKF8L
— ANI (@ANI) April 15, 2019
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more