ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీలోని 175 నియోజకవర్గాలు, 25 లోక్ సభ నియోజకవర్గాల్లో ఎన్నికలు ముగియడంతో ఇక అన్ని పార్టీలు తమదే గెలుపని ధీమా వ్యక్తం చేస్తున్నాయి. అయితే ఎవరు ఏ మేర ఓట్ల సాధించారన్నది, సీట్లు సాధించరన్న వివరాలు, ఓట్ల శాతం ఏ పార్టీకి ఎంత మేర వచ్చిందన్న వివరాలు మాత్రం వచ్చే నెల 23న కానీ తెలియవు. ఆ రోజున ఎన్నికల ఫలితాలు వెలువడతాయి. అయితే అప్పటి వరకు ఓటరు తీర్పుమాత్రం ఈవీఎంలలో నిక్షిప్తమైవుంది.
అయితే ఓటరు తీర్పును పథిలపర్చుకున్న ఈవీఎంలపై ఇప్పటికే దేశవ్యాప్తంగా పలు అనుమానాలు ఉత్పన్నమవుతున్న నేపథ్యంలో ప్రజాతీర్పును తమవైపు తిప్పుకునేందుకు చిప్ లు, ఇతరాత్ర మార్గాలను అన్వేషిస్తున్నారన్న అరోపణలు తెరపైకి రావడంతో ఈ సారి గతంలో కంటే భిన్నంగా ఈవీఎంలను భద్రపరచే స్ట్రాంగ్ రూమ్ ల వద్ద పటిష్ట భద్రత ఏర్పాటు చేశారు ఎన్నికల అధికారులు. స్ట్రాంగ్ రూముల వద్ద కేంద్ర రాష్ట్ర బలగాలు మూడంచెల పటిష్ఠ బందోబస్తును ఏర్పాటు చేశాయి. ఆ భద్రత ఎలా వుంటుందంటే..
తొలి దశలో ఈవీఎంలను భద్రపరిచిన స్ట్రాంగ్ రూమ్ తలుపులకు సీల్ వేసిన చోట సాయుధులైన కేంద్ర బలగాలు కాపలా ఉంటాయి. ఇది మొదటి దశ భద్రత. ఇక రెండో దశలో రాష్ట్ర పత్యేక బలగాలు కాపలా ఉంటాయి. మూడో దశలో స్ట్రాంగ్ రూములకు 100 మీటర్ల పరిధిలో 144 సెక్షన్ అమలు చేస్తూ, రాష్ట్ర పోలీసులు పహారా కాస్తుంటారు. ఇక ప్రధాన పార్టీల ఏజంట్లు కూడా స్ట్రాంగ్ రూముల వద్ద కాపలా ఉండనున్నారు. ఇప్పటికే ప్రధాన పార్టీలు తమ కార్యకర్తలు ఫిఫ్ట్ ల వారీగా ఈవీఎంలకు కాపలా కాయాలని పిలుపునిచ్చాయి.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more