అటు కేంద్రంలో ఇటు రాష్ట్రంలో అధికారంలో వున్న బీజేపి, టీఆర్ఎస్ పార్టీలు ప్రజల ముందు కొత్త నాటకానికి తెరతీసాయని కేంద్ర మాజీ మంత్రి ఎస్ జైపాల్ రెడ్డి విమర్శించారు. ఈ రెండు పార్టీల తీరు చూస్తావుంటే.. కేంద్రంలో మైత్రి.. రాష్ట్రంలో కుస్తీ అన్నట్లుగా వుందని, అయితే ప్రజల ముందు మాత్రం కొత్త డ్రామాకు తెరతీసి ఒకరిపై మరోకరు అరోపణలు చేసుకుంటున్నారని ఆయన తీవ్రంగా విమర్శించారు. కేంద్రంలోని మోడీ ప్రభుత్వాన్ని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఎందుకు విమర్శించడం లేదని కాంగ్రెస్ సీనియర్ నేత జైపాల్రెడ్డి ప్రశ్నించారు.
ఇవాళ కరీంనగర్లో ఆయన మాట్లాడుతూ దేశంలోని బీజేపీయేతల ప్రభుత్వాలు అధికారంలో వున్న రాష్ట్రాల్లో అన్ని చోట్లా ఐటీ దాడులు జరుగుతున్నాయని అన్నారు. మనం చూస్తేనే వున్నాం మన పోరుగునున్న కర్ణాటక, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో ఐటీ దాడులు విపరీతంగా జరుగుతున్నాయని జైపాల్ రెడ్డి అన్నారు. ఆయా రాష్ట్రాల్లో ప్రత్యర్థి పార్టీల నేతలను టార్గెట్ చేసిన కేంద్రం ఎక్కడికక్కడ ఆదాయపన్ను శాఖ అధికారులతో దాడులకు పురిగోల్పుతూనే వుందన్నారు.
కాగా అని పార్టీల నేతలపై ఐటీ దాడులు చేయిస్తున్న ప్రధాని నరేంద్ర మోడీ.. తెలంగాణలోని కేసీఆర్పై కానీ, తెలంగాణ మంత్రులపై కానీ.. కనీసం తెలంగాణ ఎమ్మెల్యేలపై కూడా ఎందుకు ఐటీ దాడులు చేయించడం లేదని ప్రశ్నించారు. మోడీ-కేసీఆర్ బంధం హైదరాబాద్లో కుస్తీ.. ఢిల్లీలో దోస్తీ అన్నట్టుగా ఉందని ఎద్దేవా చేశారు. మిగులు బడ్జెట్ తో వున్న తెలంగాణను అప్పుల ఊబిలోకి నెట్టారన్న జైపాల్.. అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచాక కేసీఆర్కు అహంభావం పెరిగిందన్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more