దేశంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంలో ప్రజాస్వామ పద్దతి అపహాస్యం అవుతుందని అక్రమమార్గాలతో ప్రజాతీర్పును కొన్ని పార్టీలు తమకు అనుకూలంగా మలుచుకుంటున్నాయని అరోపణలు వచ్చిన నేపథ్యంలో దేశంలోని పలు రాజకీయ పార్టీలు దేశ సర్వోన్నత న్యాయస్థానం తలుపు తట్టాయి. దీంతో ఆయా పార్టీల పిటీషన్లపై విచారణ అనంతరం ఇవాళ దేశ అత్యన్నత న్యాయస్థానం తన అదేశాలను వెలువరించింది. సుమారు 11 ప్రతిపక్ష పార్టీలు కనీసం యాబై శాతం మేర వీవీప్యాట్ స్లిప్పులను లెక్కించాలన్న అభ్యర్థనను తోసిపుచ్చింది.
అయితే ప్రస్తుతం ఒక్కో అసెంబ్లీ నియోజకవర్గంలో ఎంచుకున్న ఒక ఈవీఎంకు అటాచ్ చేసిన వీవీప్యాట్ లలోని ఓట్ల ప్రింటవుట్లను లెక్కిస్తుండగా, ఒకటికి బదులుగా ఐదు వీవీప్యాట్లలోని స్లిప్ లను లెక్కించి, ఈవీఎంలు, వీవీప్యాట్ లను సరిపోల్చాలని దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. అలాగే పార్లమెంటు నియోజక వర్గాల విషయానికి వస్తే, ఆయా నియోజకవర్గాల్లోని మొత్తం వీవీప్యాట్ లలో 35 ఈవీఎంల వీవీ ప్యాట్ స్లిప్పులను ఈవీఎంలతో సరిపోల్చి చూసుకోవాలని తేల్చి చెప్పింది.
విపక్షాలతో పాటు పలువురు దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యాలపై వాదనలు విన్న చీఫ్ జస్టిస్ రంజన్ గొగొయ్ నేతృత్వంలోని బెంచ్, ఈ మేరకు తీర్పిచ్చింది. అయితే యాభై శాతం మేర వీవీఫ్యాట్ లను లెక్కించి చూడాలన్న ప్రతిపక్షాల పిటీషన్లపై ఈసీ, ప్రతిపక్షాల మధ్య సాగిన వాదోపవాదాలను పరిశీలించిన అత్యున్నత న్యాయస్థానం.. ఈ మేరకు తీర్పును వెలువరించింది. ఎన్నికల విధానంపై ప్రజలు, రాజకీయ పార్టీలకు మరింత విశ్వసనీయత కలగాల్సి వుందని, అందువల్ల ప్రతి నియోజకవర్గం నుంచి ర్యాండమ్ గా ఎంపిక చేసిన వీవీ ప్యాట్ మెషీన్లను ఓపెన్ చేసి, వాటిల్లోని స్లిప్ లను సరిచూసిన తరువాతనే ఫలితాలను వెల్లడించాలని ఈ సందర్భంగా రంజన్ గొగొయ్ వ్యాఖ్యానించారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more