వేసవి భానుడు ఉగ్రరూపం దాల్చాడు. ప్రజలను తన భగభగలలో అల్లాడిపోయేలా చేస్తున్నాడు. ఉదయం నుంచే ఉగ్రరూపాన్ని దాల్చుతూ ప్రకృతిలోని పశుపక్షాదులను భయభాంత్రలకు గురిచేస్తున్నాడు. వేసవి ఆరంభంలోనే ఇక పండు వేసవిలో పరిస్థితులు ఎలా వుంటాయన్నది అర్థం చేసుకోవచ్చు. ఉష్ణోగ్రత్తలో మార్పులు రోజురోజుకూ మారిపోతున్నాయి. ఈ సమ్మర్ లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు సాధారణం కంటే ఎక్కువగా నమోదయ్యే అవకాశం ఉన్నట్టు హైదరాబాద్ వాతావరణం శాఖ అధికారులు చెబుతున్నారు. కొన్ని రోజుల్లో ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయికి పెరిగే అవకాశం కూడా ఉందని హెచ్చరిస్తున్నారు.
హైదరాబాద్ సహా ఏపీ తెలంగాణలో పలుచోట్ల పగటి ఉష్ణోగ్రతలు భారీగా పెరిగాయి. రామగుండం, కొత్తగూడెం పట్టణాల్లో గరిష్టంగా 43.4 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. అత్యధికంగా రామగుండం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలం ఏడూళ్ల బయ్యారం, నిర్మల్ జిల్లా పెంబిలలో 43.4 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. అత్యధిక ఉష్ణోగ్రతల నేపథ్యంలో ఉపరితల అవర్తనం ఏర్పడి వాటి వల్ల క్యూములో నింబస్ మేఘాలు ఏర్పడతున్నాయని, వీటి వల్ల రానున్న రోజుల్లో వర్షాలు కూడా కురిసే అవకాశాలు వున్నాయని హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.
ఇటు హైదరాబాద్ నగరంలోనూ ఉష్ణోగ్రతలు భారీగా పెరుగుతూ నమోదయ్యాయి. నగరంలోని ముషీరాబాద్ లో అత్యంత 42.4 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదుకాగా.. ముషీరాబాద్, కుతుబల్లపూర్ 42.2 డిగ్రీలు, మైత్రివనం 42.1, బాలనగర్ 41.8 డిగ్రీలు.. ఆదిలాబాద్, నిజామాబాద్ లలో 42 డిగ్రీలు నమోదయ్యింది. మెదక్, నల్గొండ, మహబూబ్ నగర్..రామగుండంలలో 41 డిగ్రీలు.. ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. దీంతో వీకెండ్స్ లో హాయిగా బైటకు వెళ్లి ఎంజాయ్ చేయానుకునేవారు సైతం ఎండ తాకిడికి ఇంటి నుంచి బయటకు అడుగు పెట్టేందుకు అలోచనలో పడిపోతున్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more