సార్వత్రిక ఎన్నికల వేళ కడప జిల్లాలో టీడీపీకి షాక్ తగిలింది. కేంద్ర మాజీ మంత్రి సాయిప్రతాప్ టీడీపీ సభ్యత్వానికి రాజీనామా చేశారు. తనకు ఎంపీ టికెట్ దక్కుతుందని భావించిన ఆయన తనకు టికెట్ కేటాయించకపోవడంతో ఆయన పార్టీకి రాజీనామా చేశారు. టీడీపీ పార్టీలో మాజీ కేంద్రమంత్రిగా వ్యవహరించిన తనకు తగిన గుర్తింపు లేకపోవడం.. కనీసం తనను ఎంపీ సీటు కేటాయింపులో పరిగణలోకి కూడా తీసుకోకపోవడంతో ఆయన నోచ్చుకున్నారు. దీంతో ఆయన టీడీపీని వీడాలని నిర్ణయం తీసుకున్నారు.
రాజంపేట నుంచి ఆరుసార్లు ఎంపీగా ఎన్నికైన ఆయన రాజంపేట పార్లమెంట్ టికెట్ ఆశించి టీడీపీలో భంగపడ్డారు. యూపీఏ హయాంలో ఆయన కేంద్రమంత్రిగా పని చేశారు. సాయిప్రతాప్ వైసీపీలో చేరతారని ప్రచారం జరుగుతోంది. సాయిప్రతాప్ రాష్ట్ర విభజనకు ముందు రాజకీయాల్లో ఓ వెలుగు వెలిగారు. 2009 ఎన్నికల్లో గెలిచిన తర్వాత కేంద్రంలో మంత్రి కూడా అయ్యారు. ఆ తర్వాత వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణించడంతో పరిణామాలు మారిపోయాయి.
2011లో కేంద్రమంత్రి పదవికి రాజీనామా చేసిన సాయిప్రతాప్... 2014లో రాష్ట్ర విభజన తర్వాత కాంగ్రెస్ పార్టీకి దూరంగా ఉంటూ వచ్చారు. వైఎస్ఆర్తో ఉన్న సాన్నిహిత్యంతో ఆయన వైసీపీలో చేరతారని భావించినా... 2016లో టీడీపీలో చేరారు. టీడీపీ తరపున మళ్లీ ఎంపీగా పోటీ చేస్తారని అనుకున్నారు. చంద్రబాబు మాత్రం అవకాశం ఇవ్వలేదు. రాజంపేట ఎంపీ అభ్యర్థిగా మాజీ ఎంపీ ఆదికేశవులునాయుడు భార్య, టీడీపీ ఎమ్మెల్యే సత్యప్రభకు చంద్రబాబు ఛాన్స్ ఇచ్చారు.
టికెట్ రాకపోవడంతో అసంతృప్తిగా ఉన్న సాయిప్రతాప్... టీడీపీ సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఆయన ఏ పార్టీలో చేరతారనే అంశంలో క్లారిటీ లేదు. వైసీపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నట్టు ప్రచారం జరుగుతోంది. లోక్ సభ ఎన్నికలకు ముందు సాయిప్రతాప్ టీడీపీని వీడటం రాజంపేట పార్లమెంట్ నియోజకవర్గంలో టీడీపీకి కొంత నష్టం జరిగే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more