ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంలో ఏ పార్టీకి ఎవరు ఓటు వేస్తున్నారన్న విషయం తెలియకుండా రహస్య ఓటు పద్దతిని తీసుకువచ్చింది భారత రాజ్యాంగం. అయితే పార్టీల సానుభూతి పరులు మాత్రం ఎన్నికల ప్రచారంలో ముమ్మరంగా పాల్గోని ఓట్లను అభ్యర్థించే పరిస్థితి పోయి.. ప్రత్యర్థి పార్టీల కీలక నేతలపై దాడులు ప్రతిదాడుల వరకు చేరుకుంది. అంతటితో ఆగకుండా అధిపత్యం కోసం నేతలు చేస్తున్న రాజకీయాలు ఫ్యాక్షన్ రాజకీయాలను తలపించాయి.
ఇక ఇవి నాయకుల నుంచి కార్యకర్తలకు కూడా పాకి తృతీయశ్రేణి నాయకులుగా ఎదిగేందుకు దోహదపడుతున్నాయి. ఈ క్రమంలో వారి అగడాలు మరింతగా శృతిమించిపోతున్నాయి. ఈ క్రమంలో ఇలాంటి రాజకీయాల నుంచి మార్పు దిశగా తీసుకెళ్తానని ప్రచారం చేస్తున్న పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కు అకర్షితులైన ఓ కుటుంబం.. ఆయనకు ఓటేస్తామని చెప్పడంతో.. వైసిపీ పార్టీ సానుభూతిపరుడైన ఇంటి యజమాని వారినిపై అర్థరాత్రి దౌర్జన్యం చేశాడు. నిండు గర్భిణి అని కూడా చూడకుండా అర్థరాత్రి పీకలదాకా తాగోచ్చి వారిని తన ఇంట్లోంచి గెంటేసి.. తాళం వేసి.. దిక్కున్న చోట చెప్పుకోమంటూ బెదిరించాడు.
విశాఖ జిల్లా గాజువాకలో జరిగిన ఈ ఘటన స్థానికంగా కలకలం రేపుతోంది. వివరాల్లోకి వెళ్తే.. పెదగంట్యాడ మండలం నెల్లిముక్కు ప్రాంతంలోని పిట్టవీధికి చెందిన ఎన్.నాగమణి-సిద్ధు దంపతులు. వీరికి మూడేళ్ల పాప ఉండగా, నాగమణి ప్రస్తుతం నిండు గర్భిణి. స్టీల్ ప్లాంట్ ఉద్యోగి అయిన నాగేశ్వరరావు ఇంట్లో వీరు మూడేళ్లుగా అద్దెకుంటున్నారు. ఇటీవల ఇంటి యజమాని వారి వద్దకు వచ్చి వైసీపీ అభ్యర్థి తరపున ప్రచారానికి రావాలని, ఒక్కో ఓటుకు వెయ్యి రూపాయలు ఇస్తానని ప్రలోభ పెట్టే ప్రయత్నం చేశాడు. తన భార్య నిండు గర్భిణి కావడంతో రాలేమని సిద్దూ చెప్పాడు. అయినా, తాము పవన్ అభిమానులమని, ప్రచారానికి రాలేమని చెప్పారు.
వారు అలా చెప్పడంతో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన నాగేశ్వరరావు వారితో గొడవపడ్డాడు. వెంటనే ఇల్లు ఖాళీ చేయాలని హుకుం జారీ చేశాడు. తమకు కొంత సమయం కావాలని మొత్తుకున్నా వినిపించుకోలేదు. రాత్రి నాగేశ్వరరావు, వారి బంధువులు తాగి వచ్చి మరోమారు గొడవ పడ్డారు. నాగమణి జుట్టుపట్టుకుని బయటకు తోసేశారు. దీంతో ఆమె ఇనుప గ్రిల్ తగిలి కిందపడిపోయింది. దంపతులు ఇద్దరినీ బయటకు లాగేసి ఇంటికి తాళం వేశారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇంటి యజమాని దాడిలో తీవ్రంగా గాయపడిన నాగమణి ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స నిమిత్తం తరలించారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more