ఆంధ్రప్రదేశ్ మంత్రి తనకు పరాభావం ఎదురుకావడం ఇష్టం లేక చివరి క్షణంలో మీడియాకు షాకిచ్చారు. తన చేజేతులా తన పరువును తీసుకునే కార్యక్రమానినికి హాజరుకావడం ఇష్టం లేని అమాత్యులు.. ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకున్నారు. అయితే తొలుతు వస్తానని చెప్పి మంత్రివర్యులు చెప్పడంతో అన్ని ఏర్పాట్లు చేసి.. విస్తృతంగా ప్రచరాం కూడా చేసిన తరువాత ఆఖరుక్షణంలో ఆయన హ్యాండివ్వడంతో విశాఖ మీడియా ఆయన తీరుపై తీవ్ర అసహనం వ్యక్తం చేసింది.
ఇంతకు ఆ అమాత్యుల వారు ఎవరు అనుకుంటున్నారా.? రాష్ట్ర విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు. ఎన్నికల తరుణంలో విశాఖ జర్నలిస్ట్ ఫోరమ్ విశాఖలోని నియోజకవర్గాల అభ్యర్థులందరినీ ఏకతాటిపైకి తీసుకువచ్చి.. వారితో ముఖాముఖి కార్యక్రమాన్ని నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసింది. ఈ క్రమంలో విశాఖ ఉత్తర నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న అభ్యర్థులను ముఖాముఖి కార్యక్రమానికి అహ్వానించింది. తొలుత హాజరవుతానని చెప్పిన గంటా చివరికి ముఖం చాటేశారు.
ఈ విషయాన్ని ఫోన్ లో మీడియా మిత్రులకు గంటా తెలియజేసిన మంత్రివర్యులు తాను ఎందుకు రావడం లేదో కూడా వివరణ ఇచ్చారు. ఈ సమావేశానికి బీజేపీ తరఫున పోటీ చేస్తున్న విష్ణుకుమార్ రాజు వస్తున్నారని గంటా తెలిపారు. విష్ణుకుమార్ రాజు ఉంటే తాను ముఖాముఖికి రానని స్పష్టం చేశారు. ఒకవేళ తాను ముఖాముఖికి వస్తే రాజు తనకు మాట్లాడే అవకాశం కల్పించకుండా, ఏకఫక్షంగా వాదిస్తూ.. తనపై అరోపణలు గుప్పించే అవకాశం వుందని, ఇలాంటి కీలక సమయంలో తన పరువు తీసుకునే ఇష్టం లేక తాను రావడం లేదని గంటా వ్యాఖ్యానించినట్లు సమాచారం.
విశాఖ ఉత్తరం నియోజకవర్గం నుంచి వైసీపీ తరఫున కేకే రాజు, బీజేపీ తరఫున విష్ణుకుమార్ రాజు, ఇక టీడీపీ నుంచి గంటా శ్రీనివాసరావు, జనసేన అభ్యర్థిగా పి. ఉషాకిరణ్, కాంగ్రెస్ అభ్యర్థిగా గోవిందరాజు పోటీ చేస్తున్నారు. ఈ ముఖాముఖి సదస్సుకు గంటా తప్ప మిగతా నేతలందరూ హాజరయ్యారు. ఇటీవల విష్ణుకుమార్ రాజు మాట్లాడుతూ.. విశాఖ నార్త్ కొండలపై గంటా కన్నుపడిందనీ, అందుకే ఇక్కడి నుంచి పోటీ చేస్తున్నారని ఆరోపించారు. ఒక్కో ఓటును రూ.10,000 పెట్టి కొంటున్నారని విమర్శించారు. గంటా పోలింగ్ ఏంజెట్లను సైతం కొనేసే ప్రమాదకరమైన వ్యక్తి అని దుయ్యబట్టారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more