ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలతో పాటు తొలిదశ సార్వత్రిక ఎన్నికలకు కూడా ముహూర్తం సమీపిస్తున్న క్రమంలో రాష్ట్రంలో ప్రచారం హోరెత్తుతోంది. ప్రధాన పార్టీలైన టీడీపీ, వైసీపీ, జనసేన పార్టీల అధినేతలు చంద్రబాబు, జగన్, పవన్ కల్యాణ్ లతో పాటు జాతీయ పార్టీలైన బీజేపి, కాంగ్రెస్ అభ్యర్థులు కూడా తమ శక్తి మేరకు ఎన్నికల ప్రచారాన్ని ఉధృతం చేస్తున్నారు. ప్రజలిచ్చిన అధికారాన్ని మరోమారు నిలబెట్టుకోవాలని టీడీపీ, అధికారాన్ని అందుకోవాలని వైసీపీ అధ్యక్షుడు జగన్, మార్పు సాధించాలని.. యువతకు బంగారు భవితను అందించాలని పవన్ కల్యాణ్ విస్తృతంగా పర్యటిస్తున్నారు.
కాగా ఇవాళ తూర్పుగోదావరి జిల్లాలోని ముమ్మిడివరంలో ప్రచారం నిర్వహిస్తున్న వైసీపీ అధినేత జగన్.. అధికార టీడీపీ ప్రభుత్వం, సీఎం బాబుపై తీవ్రస్థాయిలో విరుచుకపడుతున్నారు. బాబు మరోసారి అధికారంలోకి వస్తే తీవ్రమైన సమస్యలు ఏర్పడుతాయని వెల్లడించారు. బాబు ప్రకటించిన పథకాలు రద్దవుతాయని, చంద్రబాబుకు పొరపాటున ఓటేస్తే ఒక్క ప్రభుత్వ పాఠశాల కూడా ఉండదని అన్నారు. కరెంట్, ఆర్టీసీ, పెట్రోల్ సహా అన్నీ చార్జీలు పెంచేస్తాడని జోస్యం చెప్పారు. ఒక 20 రోజులు ఓపిక పడితే వైసీపీ అధికారంలోకి వస్తుందని..సమస్యలు తీరుతాయని ప్రతొక్కరికి చెప్పాలని ప్రజలను కోరారు.
బాబు అధికారంలోకి వస్తే పలు పథకాలు, కార్యక్రమాలు రద్దు చేస్తారని జగన్ వెల్లడించారు. అంతకుముందు విశాఖ జిల్లా పాయకరావుపేటలో జగన్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఎన్నికల సమయంలో గెలుపొందేందుకు బాబు ప్రతి గ్రామానికి డబ్బుల సంచులు పంపిస్తాడని ఒక్కో ఓటర్ కు రూ. 3వేలు పంచే ప్రయత్నం చేస్తాడని తెలిపారు. వైసీపీ అధికారంలోకి వస్తే ఎలాంటి పనులు చేస్తామో ప్రకటించారు. పలు సంక్షేమ పథకాలతో రైతులను, డ్వాక్రా సంఘాల వారిని, అన్ని వర్గాల ప్రజలను ఆదుకుంటామని జగన్ హామీనిచ్చారు.
మళ్లీ బాబు సీఎం అయితే..
* డ్వాక్రా సంఘాలకు వడ్డీలు పెంచుతాడు.
* బ్యాంకుల నుండి వచ్చే రుణాలు రైతులకు ఇవ్వడు.
* రైతులకు సబ్సిడీలను తొలగిస్తారు.
* మళ్లీ అధికారంలోకి భూములు ఇళ్లు లాక్కొంటారు.
* బాబు చెప్పిన పథకాలు అన్నింటినీ రద్దు చేస్తాడు.
* రైతులకు ఉచిత విద్యుత్ ఉండదు.
* ఆరోగ్య శ్రీ పూర్తిగా రద్దు చేస్తారు.
* 108, 104 ఏవీ ఉండవు.
* రూ. 40 వేలు ఉన్న లారీ ఇసుక రూ. లక్ష అవుతుంది.
* కాలేజీల ఫీజులు ఆకాశాన్ని అంటుతాయి. ఫీజు రీయింబర్స్ మెంట్ పూర్తిగా రద్దు చేస్తారు.
* పేదవాడి సొంతింటి కల కలగానే మిగిలిపోతుంది.
* వ్యతిరేకించే వారిని బాబు వదిలిపెట్టడు.
* బాబు..ఆయన మనుషులు ఎలాంటి నేరం చేసినా పత్రికలు, టీవీల్లో వార్తలు రావు.
* రాష్ట్రంలో పరిపాలన అనేది ఉండదు.
* రేషన్ కార్డులను, పెన్షన్లు తొలగిస్తారని జగన్ అన్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more