ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ బరిలో తొలిసారిగా దిగుతూ ప్రజల అభీష్టాన్ని కోరుతూ రణక్షేత్రంలోకి అడుగుపెట్టిన రాష్ట్ర మంత్రి, టీడీపీ నేత నారాయణకు సరిగ్గా ఎన్నికలకు మరో పక్షం రోజులు కూడా లేని సమయంలో ఎదురుదెబ్బ తగిలింది. మంత్రి నారాయణ తోడల్లుడు రామ్మోహన్ ఆయన అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకిస్తూ.. ఆయన ప్రాతినిథ్యం వహిస్తున్న పార్టీకి కూడా దూరంగా జరుగుతూ ప్రత్యర్థి పార్టీ వైసీపీలో చేరారు. వైసీపీ నేతలు ఆదాల ప్రభాకర్రెడ్డి, అనిల్ కుమార్ ల సమక్షంలో రామ్మోహన్ వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు.
ఈ సందర్భంగా రామ్మోహన్ కు కండువా కప్పిన ఆదాల ప్రభాకర్ రెడ్డి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు.ఈ సందర్భంగా రామ్మోహన్ మాట్లాడుతూ.. టీడీపీ ప్రభుత్వ పాలన నచ్చకే తాను వైసీపీలో చేరానని తెలిపారు. నెల్లూరు జిల్లాను రూ.5,000 కోట్లతో అభివృద్ధి చేశామని మంత్రి నారాయణ చెప్పడాన్ని ఆయన తప్పుపట్టారు. ఒకవేళ నిజంగానే నెల్లూరును రూ.5 వేల కోట్లతో అభివృద్ధి చేస్తే ఇప్పుడు డబ్బులు పెట్టి ఓట్లను ఎందుకు కొంటున్నారని నిలదీశారు.
నెల్లూరు జిల్లాలో ఇవాళ జరిగిన ఓ కార్యక్రమంలో ఈ రాజకీయ మార్పులు, చేర్పులు చోటుచేసుకోవడంతో మంత్రి నారాయణకు ఎదురుదెబ్బ తగిలింది. మరోవైపు రామ్మోహన్ రాకతో జిల్లాలో వైసీపీ మరింత బలపడుతుందని ఆ పార్టీ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. మంత్రి నారాయణ విధానాలు తమ కుటుంబసభ్యులకు నచ్చకే వారు ఆయనకు మద్దతు ఇవ్వడం లేదని కూడా పుకార్లు షికార్లు చే్తున్నాయి. ఇక దీనిపై స్పందించిన టీడీపీ వర్గాలు మాత్రం తాము ఓట్లను కొంటున్నామన్న వార్తలు పూర్తిగా సత్యదూరమని అదే జరిగితే రామ్మాహన్ తమ గూటి నుంచి వైసీపీకి ఎందుకు వెళ్తారని ప్రశ్నిస్తున్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more