తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావుకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. 2018లో నిర్వహించిన తెలంగాణ అసెంబ్లీ ముందస్తు ఎన్నికల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ నిబంధనలు ఉల్లంఘించారంటూ పిటిషన్ ను విచారణకు స్వీకరించిన రాష్ట్రోన్నత న్యాయస్థానం సీఎంకు నోటీసులను జారీ చేసింది. గజ్వేల్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి గెలిచిన కేసీఆర్ ఎన్నికల అఫిడవిట్ లో తప్పుడు సమాచారం ఇచ్చారని పిటిషన్ దాఖలైంది.
కేసీఆర్ ప్రాతినిథ్యం వహిస్తున్న గజ్వెల్ కు చెందిన శ్రీనివాస్ అనే ఓటరు కేసీఆర్ పై ఈ పిటీషన్ దాఖలు చేశారు. అఫిడవిట్లో తప్పుడు వివరాలు పొందుపరిచినందువల్ల కేసీఆర్పై అనర్హత వేటు వేయాలని శ్రీనివాస్ కోర్టుకు అప్పీల్ చేశారు. పిటిషన్ ను విచారణకు స్వీకరించిన న్యాయస్థానం ముఖ్యమంత్రి కేసీఆర్ తో పాటుగా ఎన్నికల కమీషన్ అధికారులకు నోటీసులు జారీ చేసింది. ఈ వివరాలతో సంబంధమున్న మొత్తం 14 మందికి నోటీసులు జారీ చేసింది.
కేసీఆర్ పోందుపర్చని వివరాలేంటి.?
గత ఏడాది డిసెంబర్ 7న జరిగిన తెలంగాణ అసంబ్లీ ముందస్తు ఎన్నికల సందర్భంగా కేసీఆర్ తనపై నమోదైన కేసులపై అఫిడవిట్ లో తప్పుడు సమాచారం పొందుపర్చారు. ఆయనపై ఏకంగా 64 క్రిమినల్ కేసులు ఉంటే మొదటి అఫిడవిట్ లో కేవలం 4 కేసులు మాత్రమే చూపారని పిటిషనర్ పేర్కొన్నారు. దీంతో ఈ పిటిషన్ ను విచారణకు స్వీకరించిన హైకోర్టు... సీఎం కేసీఆర్ సహా 14 మందికి నోటీసులు జారీ చేసింది. దీనిపై నాలుగు వారాల్లోగా స్పందించి వివరణను ఇవ్వాలని అదేశించిన న్యాయస్థానం.. తదుపరి విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more