రాష్ట్రంలో తృతీయ ప్రత్యామ్నాయంగా అవిర్భవించిన జనసేన పార్టీ రాష్ట్రంలోని యువత నుంచి పెద్ద ఎత్తున అదరాభిమానాలను చూరగోంటూ ఎన్నికల రణక్షేత్రంలో దూసుకుపోతొంది. ఈ క్రమంలో రాష్ట్రంలో తిష్ట వేసిన రాజకీయా పార్టీలు పవన్ కల్యాణ్ పార్టీని మొగ్గలోనే తుంచివేసేందుకు కుట్రలు పన్నుతున్నాయా.? అంటే ఔనన్న సమాధానాలనే కనిపిస్తున్నాయి. అన్ని విషయాల్లో వైరివర్గాలుగా వున్న అధికార టీడిపీ, ప్రతిపక్ష వైసీపీ వర్గాలు ఈ విషయంలో మాత్రం ఇద్దరు సిద్దాంతాలు ఒక్కటిగానే స్పష్టంగా కనిపిస్తున్నాయి.
రాష్ట్రంలో తాను తృతీయ ప్రత్నామ్యాయ పార్టీ అని.. కేవలం మార్పు కోసం.. పారదర్శకమైన పాలన కోసం.. మాత్రమే తాను వచ్చానని.. ప్రశ్నించడానికి గళంతో పాటు ఆ గళానికి చట్టసభలో స్థానం కూడా కావాలని గుర్తించి ప్రత్యక్ష పోరు బరిలోకి దిగుతున్నానని చెప్పిన పవన్ కల్యాణ్.. ఈ క్రమంలో తాను రాష్ట్రంలోని వామపక్ష పార్టీలు, బీఎస్పీ పార్టీ మినహా ఏ పార్టీతోనే ఎలాంటి పోత్తు పెట్టుకోనని ఆయన గంటాపథంగా చెప్పుకోచ్చారు. అయినా..పవన్ పై పత్రికలు ఎల్లో జర్నలిజానికి పాల్పడుతున్నాయి. ఆయన అన్నది ఒకటైతే.. మరోవిధంగా శీర్షీకలు పెడుతూ ఆయన అభిమానులలో గంధరగోళం సృష్టించే ప్రయత్నాలు చేస్తున్నాయి.
ఇందుకు సాక్షి దినపత్రికలో వచ్చిన వార్తే నిలువెత్తు సాక్ష్యంగా మారింది. సరిగ్గా ఎన్నికల ప్రచారంలో అన్ని పార్టీలు పూర్తిగా నిమగ్నమైన సమయంలో సాక్షి దినపత్రికలో వచ్చిన ఈ కథనం.. దాని శీర్షికకు ఎలాంటి సంబంధం లేదు. ఎలాంటి తెలివిలేని రిపోర్టర్ అయినా.. ఈ టైటిల్ పెట్టడు. అలా అయన పెట్టిన సబ్ ఎడిటర్ దానిని ఎలా అమోదించాడన్నది కూడా ప్రశ్న. అసలు సాక్షి పత్రికలో స్టాప్ కూడా ఎన్నికల ప్రచారంలో నిమగ్నమయ్యారా.? అందుకనే ఇలాంటి తప్పులు ప్రచురితం అవుతున్నాయా.? అన్న అనుమానాలు కూడా తెరపైకి వస్తున్నాయి. టీడీపీ శ్రేణులు మద్దతిస్తే అండగా ఉంటా అన్న శీర్షక బదులు టీడీపీ మద్దతిస్తే అండగా ఉంటా అన్న శీర్షక ఎలా ప్రచురించగలిగారో వారికే అర్థంకావాలి.
ఇది కేవలం సాక్షి పేపర్ వరకే పరిమితం కాదు. ఇటీవలి కాలం వరకు పవన్ కల్యాణ్ పై ఇలాంటి ఎల్లో జర్నలిజం కథనాలు, విశ్లేషణలు అనేకం వచ్చాయి. తాను కులరహిత సమాజాం కోసం పాటుపడతానని ఆయన గొంతు చించుకుని అరుస్తున్నా.. ఆయనపై కూడా కులముద్రను పత్రికలు వేశాయి. అయితే దీనిపై పవన్ కల్యాణ్ ఘాటుగానే స్పందించి కౌంటర్ ఇచ్చారు. మీ పార్టీకి అండగా నిలిచినన్నాళ్లు నా కులం మీకు గుర్తుకు రాలేదా.? అంటూ ప్రశ్నించారు. ఇలా పవన్ విషయంలో ఇటు అధికార పక్షానికి చెందిన మీడియాతో పాటు అటు ప్రతిపక్షానికి చెందిన మీడియా కూడా చేతులు కలిపి ఆయన పార్టీ అభిమానులను గంధరగోళానికి గురిచేయడానికి ప్రయత్నిస్తున్నాయన్న విమర్శలు వినబడుతున్నాయి.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more