దేశంలో ప్రధాని మోడీ వేడి తగ్గింది.. కాంగ్రెస్ గాడి తప్పింది అని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లోలాగే లోక్ సభ ఎన్నికల్లోనూ కాంగ్రెస్, బీజేపీలకు బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. లోక్ సభ ఎన్నికల్లో టీఆర్ఎస్ 16 సీట్లు గెలవాలన్నారు. తెలంగాణ భవన్లో కేటీఆర్ సమక్షంలో పలువురు నాయకులు టీఆర్ఎస్ లో చేరారు. లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ గెలిస్తే మోడీకి లాభం చేకూరుతుందని.. కాంగ్రెస్ గెలిస్తే రాహుల్ గాంధీకి లాభం చేకూరుతుందని.. అదే 16 మంది టీఆర్ఎస్ ఎంపీలు గెలిస్తే తెలంగాణకు లాభం చేకూరుతుందని కేటీఆర్ చెప్పారు.
తెలంగాణ హక్కుల సాధన కోసం పేగులు తెగేదాక కొట్లాడే దమ్మున్న ఏకైక పార్టీ టీఆర్ఎస్ అని కేటీఆర్ అన్నారు. ఢిల్లీ గులాంలు కావాలో? తెలంగాణ గులాబీలు కావాలో? తేల్చుకోవాలన్నారు. కాంగ్రెస్, బీజేపీలతో ఒరిగిందేమీ లేదన్నారు. రైతు బంధు, రైతు బీమా పథకాలు ప్రపంచంలో ఇంకెక్కడైనా ఉన్నాయా? అని కేటీఆర్ ప్రశ్నించారు. దేశంలో మోడీ హవా తగ్గిందని, ఎన్డీయేకు 150, యూపీఏకు 100 సీట్లకు మించి వచ్చే పరిస్థితి లేదని కేటీఆర్ చెప్పారు.
టీఆర్ఎస్ 16 ఎంపీ సీట్లు గెలిచి ఢిల్లీని శాసించాలన్నారు. ఇద్దరు ఎంపీలతో తెలంగాణ తెచ్చిన ఘనత సీఎం కేసీఆర్ది అన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ఖాళీ అవుతోందని, పార్టీని నడిపే దమ్ములేక కాంగ్రెస్ నేతలు నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారని కేటీఆర్ మండిపడ్డారు. ఏపీ సీఎం చంద్రబాబు తెల్లారి లేచింది టీఆర్ఎస్ ను తిడుతున్నారని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ ను విమర్శించే చంద్రబాబు.. ఆయన పథకాన్ని కాపీ కొట్టి అన్నదాత సుఖీభవ పేరు పెట్టారని అన్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more