మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసును సిబిఐకి అప్పగించాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి డిమాండ్ చేశారు. సుదీర్ఘ రాజకీయ చరిత్ర వున్న నేతను అత్యంత దారుణంగా ఇంట్లోకి ప్రవేశించి నరికి చంపారని అయన అరోపించారు. ఈ కేసు విచారణలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై తమకు నమ్మకం లేదని వైఎస్ జగన్ అన్నారు. విచారణ అధికారులకు తన కళ్ల ముందే ఫోన్లు వచ్చాయని, కేసు దర్యాప్తులో అనేక రకాలుగా ప్రభావం చూపుతున్నారని జగన్ అరోపించారు.
బెడ్ రూమ్ లో దారుణంగా నరికి చంపిన హంతకులు ఆయనను బాత్ రూమ్ వరకు తీసుకెళ్లి అక్కడ పడవేశారని, బాత్ రూమ్ గోడలకు రక్తం పూసి సహజ మరణంగా చిత్రీకరించేందుకు ప్రయత్నించారని అరోపించారు. వైఎస్ వివేకా హత్య రాజకీయంగా నీచమైన చర్యగా పేర్కోన్న ఆయన.. ట్లో ఎవరూ లేనప్పుడు వచ్చి దారుణంగా నరికి చంపారని అరోపించారు. ఇక ఓ తప్పుడు లేఖని సృష్టించి..డ్రైవర్పై నేరం మోపేందుకు కుట్రచేశారని ఆరోపణలు చేశారు.
తమ తాత రాజారెడ్డి, నాన్న వైఎస్ రాజశేఖర్ రెడ్డిని గతంలో ఇలానే కుట్రచేసి చంపేశారని.. తనపైనా విశాఖ ఎయిర్పోర్టులో హత్యాయత్నం జరిగిందన్నారు. ఇప్పటికీ తమ తండ్రి మరణంలో ఇంకా అనేక అనుమానాలు కోనసాగుతూనే వున్నాయన్నారు. ఈ మూడింటిలోనూ ఏపీ సీఎం చంద్రబాబు ప్రమేయం ఉందని ఆరోపించారు. చంద్రబాబు ప్రభుత్వంలోనే తమ తాత, బాబాయ్ లపై హత్యలు జరిగాయన్న ఆయన.. ఇప్పుడు తాజాగా తనపై కూడా హత్యయత్నం జరిగిందని అరోపించారు. సీబిఐ దర్యాప్తు వేస్తేనే నిజాలు బయటకు వస్తాయని పేర్కొన్నారు.
(And get your daily news straight to your inbox)
May 16 | ఆయనో ప్రోఫెసర్.. ఎదిగిన విద్యార్థులకు ఉన్నతమైన వ్యక్తులుగా.. ప్రోఫెషనల్ కోర్సులను బోధించే గౌరవప్రదమైన వృత్తిలో కొనసాగుతున్నాడు. అయితే ఆయన చేసిన పనే ఇప్పుడాయనను వార్తల్లో నిలిపింది. తాను ప్రోఫెసర్ అన్న విషయాన్ని మర్చిన ఆయన..... Read more
May 16 | సింగిల్ బిర్యానీ ఖరీదు ఎంత.. అంటే ఠక్కున వచ్చే సమాధానం రూ.150. సరే కొంత బెస్ట్ పాపులర్ హోటల్ బిర్యాని అయినా మహాఅంటే రూ.300. అలా కాదు స్టార్ హోటల్ నుంచి తెప్పించిన బిర్యానీ... Read more
May 16 | ఈశాన్య రాష్ట్రం అసోంలో వరుణుడు ఉగ్రరూపం దాల్చాడు. వర్షంతో పాటు, వరదలు, కొండచరియలు విరిగిపడటంతో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ప్రజాజీవనం స్థంభించింది. వర్షం, వరదల కారణంగా ఇప్పటివరకు ముగ్గురు మరణించగా, అపార ఆస్తినష్టం వాటి్ల్లినట్లు... Read more
May 16 | అగ్రరాజ్యం అమెరికాలో మరోసారి కాల్పుల మోతమోగింది. న్యూయార్క్లోని బఫెలో ప్రాంతంలో చోటు చేసుకున్న కాల్పుల ఘటనలో పడిన రక్తపు మరకలు గడ్డకట్టకముందే.. మరో రెండు ప్రాంతాల్లో కాల్పుల మోత మార్మోగాయి. బఫెలో కాల్పుల ఘటన... Read more
May 16 | పద్నాలుగేళ్ల మైనర్ బాలుడిని ముద్దు పెట్టుకోవడంతో పాటు అతని రహస్యబాగాలను తాకడం అసహజ లైంగిక చర్య (అన్నాచురల్ సెక్సువల్ అసల్ట్) కిందకు రాదని బాంబే హైకోర్టు సంచలన తీర్పునిచ్చింది. 14 ఏళ్ల బాలుడిని ముద్దు... Read more