సామాన్యులకు అందని ద్రాక్షగా మారిని సామాజిక న్యాయాన్ని అరచేతిలో అస్త్రంగా మార్చగలిగే శక్తి వున్న ఏకైక రాజకీయ పార్టీ కేవలం జనసేన పార్టీయేనని జనసేన పి.గన్నవరం అభ్యర్థి, మాజీ ఎమ్మెల్యే పాముల రాజేశ్వరి దేవి అన్నారు. ప్రతీ సామాన్యుడికి సామాజిక న్యాయం జనసేన పార్టీ తోనే జరుగుతుందని అమె విశ్వాసం వ్యక్తం చేశారు. ప్రజలకిచ్చిన ఎన్నికల హామీలను నెరవేర్చడంలో తమ జనసేన పార్టీ కట్టుబడి వుంటుందని, ఏ విషయంలోనైనా నిజాయితీ వ్యవహరిస్తుందని అమె ధీమా వ్యక్తం చేశారు.
పి. గన్నవరం మండలంలోని పసుపల్లి లో భారీ ఎత్తున ఇతర పార్టీల నుంచి కార్యకర్తలు జనసైనలో చేరారు. ఈ సందర్భంగా మండల జనబాట కన్వీనర్ అరిగెల సూరిబాబు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో రాజేశ్వరి ముఖ్యఅతిథిగా పాల్గొని పార్టీలో చేరిన వారికి జనసేన కండువాలు కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. రాష్ట్ర యువత జనసేనాని నిబద్దతతు, నిస్వార్థ ప్రజాసేవ పట్ల అకర్షితులవుతున్నారని.. ఆయన అకాంక్షలను ముందుకు తీసుకుపోతున్నారని అమె పేర్కోన్నారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రానున్న ఎన్నికల్లో జనసేన పార్టీ వల్లే సామాజిక న్యాయం జరుగుతుందని.. నిజాయితీ పరఢవిల్లుతుందని, నీతి, న్యాయం, ధర్మం అనేవి పదాలు కావని, మనిషి జీవన విధానంలో సూత్రాలని జనసేన వాటిని సాక్ష్యాత్కరింపజేస్తుందని అమె తెలిపారు. మనవత్వాన్ని చాటుకునే పార్టీగా.. ప్రజా సమస్యలపై శాశ్వత పరిష్కార మార్గాలను అన్వేషించే ధోరణితో జనసేన ముందుకు సాగుతుందని అమె అన్నారు.
మనిషి మనిషిగా మార్చే ప్రయత్నంతో పాటు పారదర్శక పాలన అందించాలన్నదే తమ పార్టీ విధానమని అమె స్పష్టం చేశారు. రానున్న ఎన్నికల్లో అసెంబ్లీ, పార్లమెంట్, స్థానాలలో గాజు గ్లాసు గుర్తుకు ఓటు వేసి జనసేన పార్టీని అధిక సంఖ్యలో గెలిపించాలని కోరారు. జనసేన మేనిఫెస్టో ప్రజల మేనిఫెస్టో అని ముఖ్యంగా ఈ మేనిఫెస్టోలో మహిళలకు రేషన్ కు బదులు నగదు బదిలి ఉచిత గ్యాస్ సిలిండర్లు తదితర అంశాలను వివరించారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more