హైదరాబాద్ మహానగరంలో జనసాంధ్రత రోజురోజుకీ పెరుగుతున్న క్రమంలో నేరాలు కూడా అలానే పెరుగుతూపోతున్నాయి. కూకట్ పల్లి కేంద్రంగా పిఫ్ఫళ్ల పోడి స్కాం.. ఉప్పల్ కేంద్రంగా వేరుశనగ కుంభకోణం వెలుగుచూసిన క్రమంలో అప్రమత్తం కావాల్సిన ప్రజలు ఈజీ మనీ వెటలో రాత్రికి రాత్రి కుబేరులు కావాలన్న ఆశలతో తమ వద్ద వన్న కాసింత డబ్బును కూడా నయవంచకుల చేతిలో పెడుతూ వారినే నమ్ముతున్నారు.
మల్లీ లెవల్ మార్కెటింగ్ పేరుతో ఏ కంపెనీ ఏ రూపంలో వచ్చినా.. ఉపేక్షించరాదని, ప్రారంభంలో బాగానే వున్నా.. ఆ తరువాత వాటి నైజం నమ్మిన ప్రజలను మోసం చేయడమేనని పోలీసులు పేర్కోంటున్నా.. వారి దృష్టికీ ఈ విషయాలను తీసుకురాకుండా వేలాది రూపాయలు మొదలుకుని లక్షల వరకు పెట్టుబడులు పెట్టి వారిని నమ్ముతున్నారు. తీరా తమకు వస్తాయన్న డబ్బులు రాకపోయేసరికి.. చివరాఖరి క్షణంలో అయ్యో డబ్బులు.. అమ్మో డబ్బులు అంటూ అంగరాల్చుతున్నారు. తమను పలానా కంపెనీ మోసం చేసిందని అప్పుడు పోలీసులను ఆశ్రయిస్తున్నారు.
ఇదే విషయాన్ని మొదట్లోనే పోలీసుల దృష్టికి తీసుకెళ్లితే.. భారీ స్తాయిలో జనం డబ్బులు పోగొట్టుకోరు. ఇలాంటి నిర్లక్ష్యం వల్లనే తాజాగా సైబరాబాద్ కమీషనరేట్ పరిధిలో రూ.1000 కోట్ల మల్టీ లెవల్ మార్కెటింగ్ స్కామ్ వెలుగు చూసింది. Ebiz (ఈ బిజ్) అనే సంస్థ మల్లీ లెవల్ మార్కెటింగ్ స్కీమ్ ను ప్రవేశపెట్టి తమ కస్టమర్ల నెత్తిన శఠగోఫం పెట్టింది. ప్రజల నుంచి భారీ మొత్తంలో డబ్బులు వసూలు చేసి మోసానికి పాల్పడింది.
ఈ బిజ్ సంస్థ నిర్వాహకుల మాయ మాటలు నమ్మి అందులో పెట్టుబడి పెట్టారు. ఒకరు చేరిన తరువాత వారే మిగితా కస్టమర్లను చేర్పించాల్సి వుంటుంది. దీంతో తెలిసిన వారినే వారు సభ్యులుగా చేర్పించడంతో అటు తమ వారు మోసం చేశారని చెప్పుకునే ఛాన్స్ కూడా లేదు. దీంతో ఇక అంతా కలసి సంస్థను, సంస్థలో తొలిగా చేరిన సభ్యులను మాత్రమే నిందించాల్సిన వస్తుంది. దీంతో సభ్యులందరూ లబోదిబో అన్నాల్సిందే. బాధితులు దీనిపై సైబరాబాద్ పోలీసులను ఆశ్రయించడంతో Ebiz సంస్థ అకౌంట్లో ఉన్న రూ.70కోట్లు సీజ్ చేశారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more