ఉత్తరాంధ్రవాసుల స్వప్నం ఎట్టకేలకు సాకారమైంది. విశాఖపట్నం కేంద్రంగా రైల్వేజోన్ కు కేంద్రం సుదీర్ఘకాలం తరువాత పచ్చజెండా ఊపింది. విశాఖ కేంద్రంగా ఏర్పాటు కానున్న ఈ కోత్త రైల్వే జోన్ కు దక్షిణ కోస్తా రైల్వేజోన్ గా నామకరణం చేయనున్నారు. ఈ మేరకు కేంద్ర రైల్వేశాఖ మంత్రి పియూష్ గోయల్ ఇవాళ సాయంత్రం మీడియాతో మాట్లుడుతూ వివరాలను వెల్లడించారు. కొత్త జోన్ ఏర్పాటుపై సుదీర్ఘ అధ్యయనం చేశామని చెప్పిన ఆయన.. ఈ జోన్ పరిధిలో గుంతకల్, గుంటూరు, విజయవాడ డివిజన్లు వుంటాయని ప్రకటించారు.
ప్రస్తుత వాల్తేర్ డివిజన్ ను రెండు భాగాలుగా విభజిస్తామన్న కేంద్ర రైల్వేశాఖ మంత్రి.. ఒక భాగాన్ని విజయవాడ డివిజన్ లో కలిపి జోన్ లో ఉంచుతామని, మరో భాగాన్ని రాయగడ డివిజన్ గా మారుస్తున్నామని తెలిపారు. రాయగడ డివిజన్ ఈస్ట్ కోస్ట్ జోన్ లో భాగంగా ఉంటుందని గోయల్ వివరించారు. రైల్వే బోర్డుతో చర్చించి మిగిలిన నిబంధనలు రూపొందిస్తామని గోయల్ చెప్పారు. ఇక.. వాల్తేరు డివిజన్ ప్రస్తుతం ఈస్ట్కోస్ట్ రైల్వే జోన్ పరిధిలో ఉంది. కాగా, విజయవాడ, గుంటూరు, గుంతకల్ డివిజన్లు దక్షిణ మధ్య రైల్వే పరిధిలో ఉన్నాయి.
దీంతో రాష్ట్ర పునర్విభజన హామీల్లో ప్రత్యేక హోదా తరువాత అంతటి ప్రాముఖ్యత కలిగిన విశాఖ రైల్వే జోన్ కు ఎట్టకేలకు మోక్షం లభించినట్లు అయ్యింది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ విశాఖ పర్యటనకు రెండు రోజుల ముందు కేంద్రం ఈ కీలక ప్రకటన చేసింది. మార్చి 1న ప్రధాని నరేంద్రమోదీ విశాఖ పర్యటనకు రానున్న సందర్భంగా కేంద్రం ఈ కీలక నిర్ణయం తీసుకోవడం విశేషం. అయితే విశాఖకు ప్రత్యేక రైల్వే జోన్ ప్రకటించడానికి ప్రధాన సమస్యగా ఉన్న వాల్తేరు డివిజన్ వ్యవహారానికి ఒక పరిష్కారం చూసిన తరువాతే... కొత్త జోన్ ఏర్పాటుపై కేంద్రం నిర్ణయం తీసుకుంది.
ఆంధ్ర ప్రదేశ్ కి రైల్వే జోన్ ఏర్పాటుకు అభ్యంతరం లేదని చెబుతూ వచ్చిన ఒడిశా... తమ రాష్ట్రానికి చెందిన తూర్పుకోస్తా రైల్వేలో భాగమైన వాల్తేరు డివిజన్ విభజన మాత్రం అంగీకరించమని మెలిక పెట్టింది. వాల్తేరు డివిజన్ ను ఏపీకి కేటాయిస్తే, తూర్పుకోస్తా జోన్ నిర్వీర్యమైపోయే ప్రమాదం ఉందన్నది ఒడిశా ఆందోళన వ్యక్తం చేసింది. దేశంలో అత్యధిక ఆదాయాన్ని ఇచ్చే రైల్వే డివిజన్లలో వాల్తేరు మూడో స్థానంలో ఉండటం గమనార్హం. ఈ నేపథ్యంలో విధివిధానాలు ఏలా రూపోందిస్తారన్న విషయం వేచి చూడాల్సిందే.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more