పుల్వామా ఉగ్రదాడి ఆమెనూ కదిలించింది.. కన్నీరు పెట్టించింది! ఆమె భారతీయురాలు అయితే అందులో ఏమాత్రం ఆశ్చర్యం లేదు. కానీ ఆమె పాకిస్థానీ. భారత్పై వ్యతిరేకత నరనరాన జీర్ణించుకున్న గడ్డపై పుట్టి పెరిగిన అమ్మాయి. పేరు సెహీర్ మీర్జా. వృత్తి జర్నలిస్టు. అంతేకాదు ప్రపంచశాంతి కార్యకర్త. పెద్ద సంఖ్యలో సైనికులను బలిగొన్న పుల్వామా ఉగ్రదాడిని తాను తీవ్రంగా ఖండిస్తున్నట్లు ఆమె బాహాటంగానే చెబుతోంది. అంతేనా.. భారత్కు మద్దతుగా 'యాంటీ హేట్ చాలెంజ్'ను చేపట్టింది.
అమెకు మద్దతుగా మరికొందరు పాకిస్తాన్ యువతులు కూడా పూల్వామా దాడిని ఖండిస్తున్నామని ప్లకార్డులను ప్రదర్శించారు. అయితే వీరందరూ కూడా పాకిస్తాన్ కు చెందిన యువతులే కావడం గమనార్హం. బాలికల హక్కుల కోసం ఉగ్రవాదులతో పోరాడిన మాలాల యూసుఫ్ జాయ్ తరహలోనే అక్కడి యువతులు తమలోని మానవత్వాన్ని చాటుకునేందుకు ఉగ్రవాదాన్ని దుయ్యబడుతున్నారు. ఈ క్రమంలో జర్నలిస్టు, పీస్ యాక్టివిస్టు సెహీరా మిర్జా.. తాను పోస్టు చేసిన ఫోటోలో.. ఒక ప్లకార్డును పట్టుకుంది.
దానిపై తాను పాకిస్థానీ అమ్మాయినని, అయినా పుల్వామా దాడిని ఖండిస్తున్నానని తేల్చిచెప్పింది. ఈ క్రమంలో యాంటీ హేట్ ఛాలెంజ్ తో పాటు నో టు వార్ అనే హ్యాష్ ట్యాగ్ లను కూడా ప్లకార్డుపై రాసింది. ఈ ఫోటోను పోస్టు చేసిన తన ఫేస్ బుక్ అకౌంటులో 'దేశభక్తి కోసం మానవత్వాన్ని కుదువ పెట్టలేం' అంటూ తన ఫేస్బుక్ పేజీలో రాసుకుంది. దాని కింద.. 'నేను పాక్ అమ్మాయిని. అంతటితో ఆగకుండా.. భారత్ కవి సాహిర్ లుదిన్యావి రాసిన కవితలోని కొన్ని పంక్తులను కూడా తన సోషల్ మీడియాలో షేర్ చేసుకుంది.
‘‘రక్తం వాళ్లదా..? వీళ్లదా అన్నది కాదు.. మనుషులదే కదా అన్నది కోణం... యుద్దం తూర్పున జరిగినా.. పశ్చిమాన జరిగినా.. ప్రపంచ శాంతి హత్యగా జరిగుతుందా.?, ఇళ్ల మధ్య బాంబులు పేలుతున్నాయా.? లేక సరిహద్దుల్లో బెంబేలెత్తిస్తున్నాయా.? అన్నది కాదు.. ఆత్మాలయాలు క్షతగాత్రం అయ్యిదా.? అన్నదే కోణం.. యుద్దం స్వతహాగానే ఓ సమస్య, అదెలా సమస్యలను పరిష్కరిస్తుంది..? ఇవాళ బాంబుల విస్పోటనాలు.. రుధిరధారలు.. రేపు అకలి కేకలు, ఆర్తనాథాలు.. కరువు విలయం.. అన్న పంక్తులను కోట్ చేసింది’’.
అంతటితో అగని సెహీరా మిర్జా.. తన యాంటీ హేట్ ఛాలెంజ్ తో పాటు నో టు వార్ కు మద్దతుగా చేపట్టిన ప్రచారంలో భాగస్థులు కావాలని అందరినీ కోరుతోంది. ఆమె స్ఫూర్తితో పాకిస్తాన్ లో చాలామంది మన దేశానికి బాసటగా నిలుస్తున్నారు. భారత్-పాక్ మధ్య స్పర్థలు పోయి.. శాంతినెలకొనాలని చాన్నాళ్లుగా సెహీర్ మీర్జా పోరాడుతోంది. తాజాగా ఆమె పూల్వామా దాడిని ఖండించిన క్రమంలో అమెకు మద్దతుగా అక్కడి యువతులు కూడా బాసటగా నిలుస్తున్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more