ఆంధ్రప్రదేశ్ లో సంచలనం సృష్టించిన అంగడి జ్యోతి హత్యకేసు విచారణను పోలీసులు వేగవంతం చేశారు. ఈ హత్యకేసులో జ్యోతి ప్రియుడు చెంచు శ్రీనివాస్ పై అమె బంధువులు అనేక అరోపణలు చేస్తున్న క్రమంలోనూ వారిపై ఎలాంటి చర్యలు తీసుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఇద్దరు కానిస్టేబుళ్లపై సస్పెన్షన్ వేటు వేసిన ఉన్నతాధికారులు.. మంగళగిరి రూరల్ ఎస్ఐ బాబురావుపై బదిలీ వేటు వేశారు. సిఐ బాలాజీ ఉన్నతాధికారులకు పంపిన నివేదిక ఆధారంగా పోలీసులపై ఉన్నతాధికారులు చర్యలు తీసుకున్నారు.
కాగా, ఈ కేసులో సర్కిల్ ఇన్స్ పెక్టర్ బాలజీపై కూడా చర్యలు తీసుకోవాలని జ్యోతి బంధువులు డిమాండ్ చేస్తున్నారు. దీంతో పాటు తమ సోదరి పోస్టుమార్టం లో కూడా పోలీసులు నిర్లక్ష్యంగా వ్వవహరించారని అరోపించిన బంధువలు.. అమె మృతదేహానికి మరోమారు పోస్టుమార్టం నిర్వహించాలని కూడా డిమాండ్ చేస్తున్నారు. అయితే బంధువుల డిమాండ్ పై స్పందించిన పోలీసులు ఇవాళ జ్యోతి మృతదేహానికి రీపోస్టుమార్టం నిర్వహించనున్నారు. ఎమ్మార్వో, ఉన్నతాధికారుల సమక్షంలో ఇవాళ మరోమారు పోస్టుమార్టం నిర్వహించనున్నారు.
జ్యోతి మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించిన అనంతరం ఆమె ఒంటిపై దుస్తులను పోలీసులు సేకరించకుండానే మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. అయితే, ఆ తర్వాత నాలుక్కరుచుకున్న పోలీసులు శాస్త్రీయ ఆధారాల సేకరణకు దుస్తులు అత్యంత కీలకం కావడంతో అవి కావాలంటూ జ్యోతి కుటుంబ సభ్యులపై ఒత్తిడి తీసుకొచ్చారు. పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసిన బాధిత కుటుంబ సభ్యులు పోలీస్ స్టేషన్ ఎదుట ధర్నాకు దిగారు. దీనిని తీవ్రంగా పరిగణించిన ఎస్పీ.. ఎస్సై, సీఐలను సస్పెండ్ చేశారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more