ప్రముఖ వ్యాపారవేత్త ఎన్నారై చిరుగుపాటి జయరాం హత్య కేసులో కీలక నిందితులను తప్పించేందుకు ఆంద్రప్రదేశ్ పోలీసులు ప్రయత్నిస్తున్నారని ఆయన భార్య పద్మశ్రీ ఆరోపించిన నేపథ్యంలో అంధ్రప్రదేశ్ పోలీసులు సంచలన నిర్ణయం తీసుకున్నారని సమాచారం. పారిశ్రామిక వేత్త హత్యకేసులో పూర్తి స్థాయిలో దర్యాప్తు చేసి నిజానిజాలను వెల్లడించినా.. హతుడి భార్య తెలంగాణలోని జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేయడంపై అంధ్ర్రప్రదేశ్ పోలీసులు ఈ విషయంలో అమె తేవనెత్తిన అరోపణలకు చెక్ పెట్టే ప్రయత్నం చేస్తున్నారు.
తాము ఎలాంటి వత్తిళ్లకు లొంగి కేసును దర్యాప్తు చేయలేదని, ఎవర్నీ రక్షించాలని తమకు ఎవరి నుంచి సిఫార్సులు రాలేదని ఇదివరకే డీఎస్సీ బోస్ స్పష్టం చేసినా.. కేసు విచారణ పూర్తై.. రాకేష్ రెడ్డి సహా ఇద్దరు నిందితులను అరెస్టు చేసిన క్రమంలోనూ అమె అరోపణలు గుప్పించడంతో.. ఏపీ పోలీసులు సంచలన నిర్ణయం తీసుకున్నారని సమాచారం, ఈ కేసు నేపథ్యంలో హత్య జరిగింది హైదరాబాద్ లో కాబట్టి.. కేసును తెలంగాణ పోలీసులకు అప్పగించాలని వారు నిర్ణయించుకున్నారని తెలుస్తుంది. నేరం జరిగిన ప్రదేశంలోనే కేసు నమోదు చేయాలని చట్టంలోని నిబంధనలు చెబుడం కూడా మరో కారణంగా తెలుస్తుంది.
ఈ నేపథ్యంలో ఏపీ పోలీసులు ఈరోజు కీలక నిర్ణయం తీసుకున్నారు. జయరాం హత్య తెలంగాణలోని హైదరాబాద్ లోనే జరిగింది కాబట్టి ఈ కేసును అక్కడికే బదిలీ చేయాలని నిర్ణయించారు. మరోవైపు ఈ కేసులో నిందితులు రాకేశ్ రెడ్డి, వాచ్ మెన్ శ్రీనివాస్ లను నందిగామ కోర్టులో పోలీసులు హాజరుపరిచారు. ఈ సందర్భంగా న్యాయస్థానం వారిద్దరికీ ఈ నెల 20 వరకూ రిమాండ్ విధించింది. కాగా, జయరాం హత్య కేసులో నిందితులను వారం రోజుల పాటు కస్టడీకి ఇవ్వాల్సిందిగా పోలీసులు కోర్టును కోరే అవకాశముంది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more