ఆంధ్ర-తమిళనాడు సరిహద్దులో ఓ కారు వేగంగా వెళ్లడాన్ని గమనించిన పోలీసులు దాని ఛేజ్ చేశారు. అయితే పోలీసుల వెంటవస్తున్నారని గమనించిన కారులోకి వ్యక్తలు మరింతగా వేగాన్ని పెంచారు. కట్ చేస్తే కారును ఛేజ్ చేసిన పోలీసులు దానిని అపి తనిఖీలు చేయడంతో షాక్ తిన్నారు. కారులో రెండేవేల రూపాయల కట్టలకొద్ది డబ్బు లభ్యమైంది. ఏకంగా 6.5 కోట్ల రూపాయల డబ్బును స్వాధీనం చేసుకున్న పోలీసులు ఇందుకు సంబంధించి ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు.
ఈ ఘటన ఆంధ్ర తమిళనాడు సరిహద్దులోని నెల్లూరు జిల్లా తడ వద్ద చోటుచేసుకుంది. డబ్బును ఆదాయపన్నుశాఖ అధికారులకు అప్పగించిన పోలీసులు ఇదంత హవాలా డబ్బుగా అనుమానిస్తున్నారు. పోలీసుల కథనం ప్రకారం.. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం నుంచి కారులో ఇద్దరు వ్యక్తులు చెన్నై వైపుగా వెళ్తున్నారు. ఎస్సై దాసరి వెంకటేశ్వరరావు సూళ్లూరుపేట నుంచి వస్తూ చేనిగుంట వద్ద ఓ కారు వేగంగా వెళ్తుండడాన్ని గమనించారు.
కారులోని డ్రైవర్, మరో వ్యక్తి కంగారుగా ఉన్నట్టు అనిపించడంతో అనుమానం వచ్చిన ఎస్సై కారును ఛేజ్ చేసి తడ వద్ద కారును ఆపారు. అనంతరం కారును క్షుణ్ణంగా తనిఖీ చేసిన పోలీసులు అందులో కుప్పలు తెప్పలుగా బయటపడిన కరెన్సీ నోట్లను చూసి ఆశ్చర్యపోయారు. సీట్ల కింద, డిక్కీలో రూ. 500, రూ. 2000 నోట్ల కట్టలు బయటపడ్డాయి. వెంటనే కారును పోలీస్ స్టేషన్ కు తరలించి ఆదాయపు పన్ను శాఖ అధికారులకు సమాచారం అందించారు.
విదేశీకరెన్సీతో కలిపి మొత్తం రూ.6.5 కోట్లుగా ఆ డబ్బును లెక్కగట్టారు. అలాగే, నిందితుల నుంచి 55 గ్రాముల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. నిందితులు మాచినీడు కనక సురేశ్, చేమకూరి హరిబాబుగా పోలీసులు గుర్తించారు. నరసాపురానికి చెందిన జైదేవి నగల వ్యాపారి ప్రవీణ్ కుమార్ జైన్ ఆదేశాలతోనే తాము నగదును చెన్నై తరలిస్తున్నట్టు నిందితులు చెప్పారని పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more