పెట్రోల్, డీజిల్ ధరలు మళ్లీ పెరిగాయి. గత ఏడాది అల్ టైం హై రికార్డు ధరలను అందుకున్న ఇంధన ధరలు.. క్రమంగా తగ్గుతూ వస్తున్నాయి. అయితే ఐదు రాష్ట్రాల ఎన్నికల ముగిసి ఫలితాలు వెలువడిన తరువాత క్రమంగా ఇంధన ధరలు పెరుగుతూ వచ్చాయి. ఇక కొత్త ఏడాదిలో ఇంధర ధరలు సుమారుగా రెండు రూపాయల మేర పెరిగాయి. అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు తగ్గముఖం పట్టినా.. డాలర్ తో రూపాయి మారకం విలువ తగ్గిన నేపథ్యంలో ఇంధర ధరలపై ప్రభావాన్ని చాటుతుంది.
కొ్త్త ఏడాదిలో సుమారు 2శాతం మేర తగ్గిన రూపాయి తన పతనాన్ని ఇంధనంపై శాసించడంతో అవి.. దేశంలోని నిత్యావసర సరుకుల ధరలను ప్రభావితం చేస్తున్నాయి. కాగా జనవరిలోని 17 రోజుల్లో 9 సార్లు పెరిగిన డీజిల్ ధర.. పెట్రోల్ కన్నా అధిక సార్లు పెరిగి నిత్యావసర సరుకుల ధరలపై ప్రభావాన్ని చాటుతుంది. కాగా ఇక న్యూఇయర్ లో పెట్రోల్ ధర కూడా 8 సార్లు పెరిగింది.
అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధరలు తగ్గిన దేశీయంగా ఇంధన ధరలు పెరుగుతూ రావడం గమనార్హం. అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు తగ్గాయి. బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర బ్యారెల్ కు 61.07 డాలర్ల వద్ద.. డబ్ల్యూటీఐ క్రూడాయిల్ ధర బ్యారెల్ కు 52.07 డాలర్ల వద్ద ఉంది. తాజా ధరల ప్రకారం దేశ రాజధాని ఢిల్లీలో లీటర్ పెట్రోలు ధర 14 పైసలు పెరిగింది. అదే సమయంలో లీటరు డీజిల్ ధర 19 పైసలు ఎగసింది.
దీంతో పెట్రోల్ ధర రూ.70.47కి చేరితే.. డీజిల్ ధర రూ.64.78కి పెరిగింది. వాణిజ్య రాజధాని ముంబయిలో పెట్రోలు ధర రూ.76.11 వద్ద ఉండగా.. డీజిల్ ధర రూ.67.82 వద్ద కొనసాగుతోంది. ఇక హైదరాబాద్లో పెట్రోల్ ధర రూ.74.76 వద్ద ఉండగా.. డీజిల్ ధర రూ.70.42 వద్ద కొనసాగుతోంది. ఏపీ రాజధాని అమరావతిలో పెట్రోల్ రూ.74.55 వద్ద, డీజిల్ రూ.69.85 వద్ద కొనసాగుతున్నాయి.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more