ఆస్ట్రేలియాలోని భారత రాయబార కార్యాలయాల్లో హై అలర్ట్ ప్రకటించారు. ఎవరో గుర్తుతెలియని అగంతకులు అక్కడికి అనుమానాస్పద బ్యాగులను పంపడంతో అనుమానాలు వ్యక్తం కావడం.. అందులో విస్పోటక పదార్థాలు వున్నట్లు అనుమానించి పోలీసులు తనిఖీలు చేపట్టిన తరువాత భారత రాయభార కార్యాలయం అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. అయితే కేవలం భారత్ రాయబార కార్యాలయాన్ని మాత్రమే కాదు.. అస్ట్రేలియాలోని భారత్ సహా 12పైగా రాయబార కార్యాలయాల్లో ఇదే పరిస్థితి నెలకొంది.
12 విదేశీ రాయభార కార్యాలయలను గుర్తు తెలియని వ్యక్తులు అనుమానాస్పద బ్యాగులు పంపారు. వీటిలో భారత్ సహా పాకిస్థాన్, యూకే, దక్షిణ కొరియా, జర్మనీ, ఇటలీ, స్విట్జర్లాండ్, గ్రీక్, ఇండోనేషియా, స్పెయిన్, న్యూజిలాండ్, జపాన్, క్రొయేషియా, ఈజిప్టు, అమెరికా రాయబార కార్యాలయాలకు ఆ బ్యాగులు వెళ్లినట్లు తెలుస్తోంది. వాటిని గమనించిన ఆయా రాయబార కార్యాలయాల అధికారులు వాటిపై వెంటనే అస్ట్రేలియా పోలీసులకు సమాచారం అందించారు.
రంగంలోకి దిగిన పోలీసులు ఉద్యోగులు ఆఫీసు నుంచి బయటకు పంపించారు. ఆస్ట్రేలియా ఎమర్జెన్సీ సర్వీసెస్ కు ఫోన్ కాల్ వెళ్లింది. హుటాహుటీన పోలీసులు, ఫైరింజన్లు, అంబులెన్సులు ఆయా ఆఫీసుల దగ్గరికి చేరుకున్నాయి. పోలీసులు ఆ బ్యాగుల్లో ఏముందన్నదానిన్ని పరిశీలిస్తున్నారు. అయితే వాటిల్లో విస్పోటక పదార్థాలు లేవని తేల్చిన అధికారులు.. ప్రాణాంతక కెమికల్స్ ఉన్నాయని అనుమానాలు వ్యక్తం చేసినట్లు సమాచారం. భారత రాయబార కార్యాలయానికి వచ్చిన ఆ బ్యాగును పోలీసులు తీసుకుని వెళ్లారు. అనంతరం కాన్సులేట్ అధికారులు కార్యాలయంలోకి వెళ్లారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more